Delhi: ఢిల్లీలో మళ్లీ పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు.. మిడ్-టర్మ్ పరీక్షలు రద్దు
- ఢిల్లీలో మళ్లీ పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు
- పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు
- మిడ్-టర్మ్ పరీక్షలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. పలు పాఠశాలలకు శనివారం ఉదయం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తెల్లవారుజామున ఈ బెదిరింపులు రావడంతో పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, డాగ్ స్వ్కాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. బాంబ్ బెదిరింపులు కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు తనిఖీలు కారణంగా ద్వారక ఢిల్లీ పబ్లి్క్ స్కూల్లో మిడ్-టర్మ్ పరీక్షలను రద్దు చేశారు. అలాగే కృష్ణ మోడల్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయంలో ప్రస్తుతం పోలీసులు సోదాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: ఆ పరిస్థితి వస్తే ఎన్నికల్లో పోటీ చేయను.. తేజస్వి యాదవ్ హెచ్చరిక
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు పంపి పాఠశాల ప్రాంగణాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు కారణంగా ఈరోజు జరగాల్సిన పరీక్షలను రద్దు చేసినట్లు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. స్కూల్కు వచ్చిన వారందరిని తిరిగి ఇంటికి పంపేశారు.
ఇది కూడా చదవండి: Rashmika: బాలీవుడ్ భారీ ఫ్రాంచైజీలో రష్మిక ఎంట్రీ..
దేశంలో ప్రధాన పట్టణాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరులో వరుసగా బాంబ్ బెదిరింపులు వచ్చాయి. ప్రధానంగా పాఠశాలలే లక్ష్యంగా బెదిరింపులు వస్తున్నాయి. ఢిల్లీలో అయితే ప్రతి వారం ఇదొక తంతు అవుతోంది. ఈ మధ్య మెయిల్స్ ద్వారా బెదిరింపులు రాగా.. తాజాగా ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారు. ఇంకోవైపు పోలీసులు కూడా ఈ బెదిరింపులను సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Multiple schools in Delhi received bomb threat calls today. Among those targeted were DPS Dwarka, Krishna Model Public School and Sarvodaya Vidyalaya. Police teams, along with bomb disposal squads, were rushed to the schools. Students and staff were safely evacuated as… pic.twitter.com/LxaF1fPpN1
— ANI (@ANI) September 20, 2025
తాజావార్తలు
-
Tumbbad 2: హారర్ ప్రపంచంలోకి ఆలియా భట్.. ‘తుంబాడ్ 2’లో కీలక పాత్ర ఖరారు!
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!