BJP: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ రాజీనామా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి అధికారం చేపట్టబోతున్నారు. మొత్తం 543 స్థానాలు ఉన్న లోక్సభలో బీజేపీ కూటమి 293 సీట్లను సాధించింది. అధికారం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 272 మార్కుని దాటింది. అయితే, గతంలో 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మెజారిటీ మార్కును దాటింది. ఈ సారి మాత్రం బీజేపీ 240 సీట్లను గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటులో మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ వంటి పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: Ajit Pawar: అజిత్ పవార్కి షాక్.. కీలక సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరు..
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ముఖ్యంగా గత రెండు పర్యాయాలు బీజేపీ అధికారానికి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కీలకంగా వ్యవహరించింది. 80 ఎంపీ సీట్లు ఉన్న ఉత్తర్ ప్రదేశ్లో గత రెండు సార్లు 60 కన్నా ఎక్కువ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 2024 ఎన్నికల్లో మాత్రం బీజేపీ 33 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) 37 సీట్లను, మిత్రపక్షం కాంగ్రెస్ 06 సీట్లతో గెలుచుకున్నాయి.
అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ ఎంపీ సీటులో కూడా బీజేపీ ఓడిపోయింది. ఈ ఓటమిని దేశప్రజలు ఎవరూ కూడా ఊహించి ఉండరు. అయితే ఈ ఓటమికి తనదే బాధ్యత అని ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ చౌదరి భూపేంద్ర సింగ్ గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజీనామా అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ మెజారిటీ మార్కు చేరుకోవడంలో విఫలమైనందుకు, పార్టీ పేలవ ప్రదర్శనకు ఆయన బాధ్యత వహించి రాజీనామా చేశాడని తెలుస్తోంది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!