BJP: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ రాజీనామా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి అధికారం చేపట్టబోతున్నారు. మొత్తం 543 స్థానాలు ఉన్న లోక్సభలో బీజేపీ కూటమి 293 సీట్లను సాధించింది. అధికారం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 272 మార్కుని దాటింది. అయితే, గతంలో 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మెజారిటీ మార్కును దాటింది. ఈ సారి మాత్రం బీజేపీ 240 సీట్లను గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటులో మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ వంటి పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: Ajit Pawar: అజిత్ పవార్కి షాక్.. కీలక సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరు..
Also Read
- Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
ముఖ్యంగా గత రెండు పర్యాయాలు బీజేపీ అధికారానికి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కీలకంగా వ్యవహరించింది. 80 ఎంపీ సీట్లు ఉన్న ఉత్తర్ ప్రదేశ్లో గత రెండు సార్లు 60 కన్నా ఎక్కువ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 2024 ఎన్నికల్లో మాత్రం బీజేపీ 33 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) 37 సీట్లను, మిత్రపక్షం కాంగ్రెస్ 06 సీట్లతో గెలుచుకున్నాయి.
అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ ఎంపీ సీటులో కూడా బీజేపీ ఓడిపోయింది. ఈ ఓటమిని దేశప్రజలు ఎవరూ కూడా ఊహించి ఉండరు. అయితే ఈ ఓటమికి తనదే బాధ్యత అని ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ చౌదరి భూపేంద్ర సింగ్ గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజీనామా అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ మెజారిటీ మార్కు చేరుకోవడంలో విఫలమైనందుకు, పార్టీ పేలవ ప్రదర్శనకు ఆయన బాధ్యత వహించి రాజీనామా చేశాడని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?