Rahul Gandhi: దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై దాడి.. లాట్రల్ ఎంట్రీపై రాహుల్ ఫైర్..
- లాటరల్ ఎంట్రీ విధానంపై ముదురుతున్న వివాదం..
- బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి..
- దళితులు..ఆదివాసీలు.. ఓబీసీలకు అన్యాయం..
- ఐఏఎస్ల ప్రైవేటీకరణ అని రాహుల్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లాటరల్ ఎంట్రీ వివాదంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఆ విధానంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై దాడి అని సోమవారం అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఈ విధానాన్ని తీసుకువచ్చిందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ రామరాజ్యాన్ని వక్రీకరించి, రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి, బహుజనుల నుంచి రిజర్వేషన్లు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.
45 మంది జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీలను లాటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్మెంట్ చేసేందుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో స్పెషలిస్టు(ప్రైవేట్ రంగానికి చెందిన వారితో సహా) నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడింది. భారతదేశ పరిపాలన యంత్రాంగం, సామర్థ్యాన్ని, ప్రతిస్పందనను పెంచేందుకు నిపుణుల అవసరాన్ని గుర్తించడం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ హయాంలో లాటరల్ ఎంట్రీ పథకాన్ని అధికారికంగా ప్రవేశపెట్టారు.
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
Read Also: Kolkata Doctor Case: కోల్కతా ఆస్పత్రిపై దాడి తృణమూల్ గుండాల పనే.. బాధితురాలి న్యాయవాది..
2018లో, జాయింట్ సెక్రటరీలు మరియు డైరెక్టర్ల వంటి సీనియర్ స్థానాలకు ఖాళీలను ప్రకటించడం ద్వారా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ ఉన్నతస్థాయి పొజిషన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానించారు. కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా అభ్యర్థుల అర్హతలు, అనుభవాన్ని బేరీజు వేసుకుని ఈ కీలకమైన పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు.
అయితే, ప్రధాని నరేంద్రమోడీ సాంప్రదాయక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్ని భర్తీ చేయకుండా, ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను నియమిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పాలన నిర్మాణం, సామాజిక న్యాయం రెండింటిని దెబ్బతీసి ఈ ‘‘దేశ వ్యతిరేక చర్య’’ని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన చెప్పారు. ఈ పద్ధతి ‘‘ఐఏఎస్ల ప్రైవేటీకరణ’’ అని, రిజర్వేషన్లను అంతం చేసే ప్రక్రియ అని ఆరోపించారు.
తాజావార్తలు
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!