Rahul Gandhi: ‘‘సిక్కు’’ వివాదాస్పద వ్యాఖ్యలపై మౌనం వీడిన రాహుల్ గాంధీ.. బీజేపీపై ఆరోపణలు..
- ‘‘సిక్కు’’ వివాదాస్పద వ్యాఖ్యలపై మౌనం వీడిన రాహుల్ గాంధీ..
- తాను చెప్పిన దాంట్లో తప్పేముందని ట్వీట్..?
- కావాలనే బీజేపీ అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన వివాదాస్పదంగా మారింది. సిక్కులపై, రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. మరోవైపు సిక్కులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిక్కు సంఘాలు సోనియా గాంధీ నివాసం ముందు నిరసన తెలిపారు.
ఇదిలా ఉంటే, అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తొలిసారిగా రాహుల్ గాంధీ మౌనం వీడారు. బీజేపీ అబద్ధాలను చెబుతోందని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సిక్కు కమ్యూనిటీ గురించి తాను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా తప్పు ఉందా..? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘‘నేను భారతదేశంలో, విదేశాల్లో ఉన్న ప్రతీ సిక్కు సోదరుడుని, సోదరీమణులను అడగాలనుకుంటున్నాను. నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉందా..? భారతదేశంలో ప్రతీ సిక్కు లేదా ప్రతీ భారతీయుడు తన మతాన్ని నిర్భయంగా ఆచరించే దేశంగా ఉందా..? ’’ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
Read Also: Tirupati laddoos: తిరుపతి లడ్డూలకు “నందిని” నెయ్యి.. జీపీఎస్, ఎలక్ట్రిక్ లాక్స్తో రక్షణ..
అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ‘‘ఎప్పటి లాగే బీజేపీ అసత్య ప్రచారాన్ని ఆశ్రయించింది. వారు సత్యాన్ని సహించలేదక నన్ను మౌనంగా ఉంచాలని తహతహలాడుతున్నారు. కానీ భారతదేశాన్ని నిర్వచించే విలువలైన భిన్నత్వంలో ఏకత్వం కోసం ఎల్లప్పుడూ మాట్లాడుతాను’’ అని ఆయన ట్వీట్ చేశారు.
సెప్టెంబర్ 10న, వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ భారతదేశంలో సిక్కులు తలపాగా ధరించడానికి, కారా ధరించి గురుద్వారాలకు వెళ్లేందుకు అనుమతించబడుతారా..? దీనిపై భారత్లో పోరాటం జరుగుతోంది. ఇది ఒక సిక్కులకు సంబంధించిందే కాదు, అన్ని మతాలకు సంబంధించింది’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత అంటే ద్వేషించే అమెరికా చట్టసభ సభ్యురాలు ఇల్హన్ ఓమర్తో రాహుల్ గాంధీ భేటీ అవ్వడాన్ని కూడా బీజేపీ తీవ్రంగా విమర్శించింది.
The BJP has been spreading lies about my remarks in America.
I want to ask every Sikh brother and sister in India and abroad – is there anything wrong in what I have said? Shouldn't India be a country where every Sikh – and every Indian – can freely practice their religion… pic.twitter.com/sxNdMavR1X
— Rahul Gandhi (@RahulGandhi) September 21, 2024
తాజావార్తలు
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్టాప్లు భారత్లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..