Rahul Gandhi: ‘‘సిక్కు’’ వివాదాస్పద వ్యాఖ్యలపై మౌనం వీడిన రాహుల్ గాంధీ.. బీజేపీపై ఆరోపణలు..
- ‘‘సిక్కు’’ వివాదాస్పద వ్యాఖ్యలపై మౌనం వీడిన రాహుల్ గాంధీ..
- తాను చెప్పిన దాంట్లో తప్పేముందని ట్వీట్..?
- కావాలనే బీజేపీ అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన వివాదాస్పదంగా మారింది. సిక్కులపై, రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. మరోవైపు సిక్కులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిక్కు సంఘాలు సోనియా గాంధీ నివాసం ముందు నిరసన తెలిపారు.
ఇదిలా ఉంటే, అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తొలిసారిగా రాహుల్ గాంధీ మౌనం వీడారు. బీజేపీ అబద్ధాలను చెబుతోందని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సిక్కు కమ్యూనిటీ గురించి తాను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా తప్పు ఉందా..? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘‘నేను భారతదేశంలో, విదేశాల్లో ఉన్న ప్రతీ సిక్కు సోదరుడుని, సోదరీమణులను అడగాలనుకుంటున్నాను. నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉందా..? భారతదేశంలో ప్రతీ సిక్కు లేదా ప్రతీ భారతీయుడు తన మతాన్ని నిర్భయంగా ఆచరించే దేశంగా ఉందా..? ’’ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
Read Also: Tirupati laddoos: తిరుపతి లడ్డూలకు “నందిని” నెయ్యి.. జీపీఎస్, ఎలక్ట్రిక్ లాక్స్తో రక్షణ..
అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ‘‘ఎప్పటి లాగే బీజేపీ అసత్య ప్రచారాన్ని ఆశ్రయించింది. వారు సత్యాన్ని సహించలేదక నన్ను మౌనంగా ఉంచాలని తహతహలాడుతున్నారు. కానీ భారతదేశాన్ని నిర్వచించే విలువలైన భిన్నత్వంలో ఏకత్వం కోసం ఎల్లప్పుడూ మాట్లాడుతాను’’ అని ఆయన ట్వీట్ చేశారు.
సెప్టెంబర్ 10న, వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ భారతదేశంలో సిక్కులు తలపాగా ధరించడానికి, కారా ధరించి గురుద్వారాలకు వెళ్లేందుకు అనుమతించబడుతారా..? దీనిపై భారత్లో పోరాటం జరుగుతోంది. ఇది ఒక సిక్కులకు సంబంధించిందే కాదు, అన్ని మతాలకు సంబంధించింది’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత అంటే ద్వేషించే అమెరికా చట్టసభ సభ్యురాలు ఇల్హన్ ఓమర్తో రాహుల్ గాంధీ భేటీ అవ్వడాన్ని కూడా బీజేపీ తీవ్రంగా విమర్శించింది.
The BJP has been spreading lies about my remarks in America.
I want to ask every Sikh brother and sister in India and abroad – is there anything wrong in what I have said? Shouldn't India be a country where every Sikh – and every Indian – can freely practice their religion… pic.twitter.com/sxNdMavR1X
— Rahul Gandhi (@RahulGandhi) September 21, 2024
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..