Tirupati laddoos: తిరుపతి లడ్డూలకు “నందిని” నెయ్యి.. జీపీఎస్, ఎలక్ట్రిక్ లాక్స్తో రక్షణ..
- దేశవ్యాప్తంగా సంచలనంగా తిరుపతి లడ్డూల వివాదం..
- మళ్లీ తిరుపతి లడ్డూల కోసం ‘‘నందిని నెయ్యి’’..
- నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్.. ఎలక్ట్రిక్ లాక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati laddoos: తిరుపతి లడ్డూల వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి తక్కువ నాణ్యత కలిగి ఉండటంతో పాటు జంతువుల కొవ్వు కలిగి ఉందనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూల కోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి చెందిన ‘‘నందిని’’ నెయ్యిని తిరిగి సరఫరా చేయడం ప్రారంభించింది. తిరుపతి దేవస్థానానికి వచ్చే నెయ్యి కోసం భద్రతా చర్యల్ని పెంచింది.
తిరుపతి దేవస్థానానికి వెళ్లే నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, నెయ్యి కల్తీకి ఎలాంటి తావు లేకుండా చూస్తామని కర్ణాటక మిల్క్ ఫెడరేష్ వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రిక్ లాకుల్ని కేవలం ఆలయ బోర్డు అధికారులు మాత్రమే తెరవగలరు. లడ్డూల నాణ్యతను మెరుగుపరచడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఇటీవల కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు చెందిన నందిని నెయ్యిని తిరిగి పొందడం ప్రారంభించింది.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
Read Also: Noida: వెరీ లక్కీ.. కారు బైక్ను ఢీకొనడంతో ఎలివేటెడ్ పిల్లర్పై వచ్చి పడ్డ యువతి (వీడియో)
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నందిని 2013 నుంచి తిరుపతి దేవస్థానానికి 4,000 మెట్రిక్ టన్నుల నెయ్యిని సరఫరా చేసింది. తిరుపతి లడ్డూల వివాదం వెలుగులోకి రావడంతో మరోసారి ఈ సంస్థ నుంచే నెయ్యిని తిరిగి పొందుతున్నారు. ఈ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా దేవాలయాలకు కూడా ప్రసాదం కోసం నందిని నెయ్యిని మాత్రమే వాడాలని ఆదేశించింది.
“తిరుపతి దేవస్థానం మాత్రమే కాదు, అన్ని కర్ణాటక దేవాలయాలు నందిని నెయ్యిని ఉపయోగించడం చాలా సంతోషంగా ఉంది… నెయ్యి ఉత్పత్తిని పెంచడానికి మేము సన్నాహాలు చేస్తున్నాము. మేము డిమాండ్ను తీర్చగలము.” అని కర్ణాటక మిల్క్ ఫెడరేన్ ఛైర్మన్ భీమా నాయక్ చెప్పారు.
తాజావార్తలు
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..