Arvind Kejriwal: ‘‘మోడీ అనుమతితోనే మేనిఫెస్టో ప్రకటించారా..?’’ బీజేపీపై కేజ్రీవాల్ సెటైర్లు..
- మోడీ అనుమతి తీసుకునే మేనిఫెస్టో ప్రకటించారా..?
- ఢిల్లీ బీజేపీ మేనిఫెస్టోపై అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం రోజు బీజేపీ తన మేనిఫెస్టోని ప్రకటించింది. అయితే, ఈ మేనిఫెస్టోపై ఆప్ విరుచుకుపడుతోంది. ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బీజేపీ తన పథకాలను వెల్లడించింది. సిలిండర్లపై సబ్సిడీతలతో పాటు మహిళలకు, తల్లులకు, సీనియర్ సిటిజన్లకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది.
అయితే, బీజేపీ మేనిఫెస్టోపై ఆప్ విమర్శలు గుప్పి్స్తోంది. తమ ప్రభుత్వం పథకాలను కొనసాగిస్తే, మీకు ఎందుకు ప్రజలు ఓటేయాలని ప్రశ్నించింది. పలు సందర్భాల్లో ఉచితాలు హానికరమని బీజేపీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ఆప్ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాలు ఉచితాలకు, అభివృద్ధికి మధ్య తేడా తెలుసుకోవాని బీజేపీ ఎదురుదాడి చేసింది.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Read Also: Bharat Mobility Expo: డియో లవర్స్కి శుభవార్త.. స్పోర్టీ లుక్స్, మంచి మైలేజ్..
కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ మేనిఫెస్టోకి ప్రధాని నరేంద్రమోడీ అనుమతి ఉందా.? అని ప్రశ్నించారు. ‘‘ఉచిత పథకాలు ప్రకటించే ముందు ప్రధాని మోదీ అనుమతి తీసుకున్నారా? ఉచితాలా దేశానికి నష్టం కాదని, దేవుడి ప్రసాదమని, ప్రధాని చెప్పంది తప్పుని, కేజ్రీవాల్ చెప్పింది రైట్ అని మోడీ ఒప్పుకోవాలి’’ అని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ ఢిల్లీలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది, ఇవి బీజేపీ వాళ్లకు కూడా అందుతున్నాయని, మాకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియదని, మాకు పనిచేయడమే తెలుసని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బీజేపీ వద్ద ‘‘సంకల్ప్ మేనిఫెస్టో’’ లేదని, కేవలం ‘‘కేజ్రీవాల్ మేనిఫెస్టో’’ ఉందని కేజ్రీవాల్ అన్నారు.
కేజ్రీవాల్ విమర్శలపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా స్పందించారు. ఆప్ ఉచితాలకు, అభివృద్ధి సంక్షేమానికి మధ్య తేడాని అర్థం చేసుకోవాలని అన్నారు. మేనిఫెస్టోని ప్రకటించిన జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఆప్ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు, ఢిల్లీలో, పంజాబ్లో తన వాగ్దానాలను నెరవేర్చలేదని అన్నారు. ఆప్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక మొహల్లా క్లినిక్లను “అవినీతి నిలయం” అని కూడా ఆయన అభివర్ణించారు, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
తాజావార్తలు
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!