Arvind Kejriwal: ‘‘మోడీ అనుమతితోనే మేనిఫెస్టో ప్రకటించారా..?’’ బీజేపీపై కేజ్రీవాల్ సెటైర్లు..
- మోడీ అనుమతి తీసుకునే మేనిఫెస్టో ప్రకటించారా..?
- ఢిల్లీ బీజేపీ మేనిఫెస్టోపై అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం రోజు బీజేపీ తన మేనిఫెస్టోని ప్రకటించింది. అయితే, ఈ మేనిఫెస్టోపై ఆప్ విరుచుకుపడుతోంది. ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బీజేపీ తన పథకాలను వెల్లడించింది. సిలిండర్లపై సబ్సిడీతలతో పాటు మహిళలకు, తల్లులకు, సీనియర్ సిటిజన్లకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది.
అయితే, బీజేపీ మేనిఫెస్టోపై ఆప్ విమర్శలు గుప్పి్స్తోంది. తమ ప్రభుత్వం పథకాలను కొనసాగిస్తే, మీకు ఎందుకు ప్రజలు ఓటేయాలని ప్రశ్నించింది. పలు సందర్భాల్లో ఉచితాలు హానికరమని బీజేపీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ఆప్ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాలు ఉచితాలకు, అభివృద్ధికి మధ్య తేడా తెలుసుకోవాని బీజేపీ ఎదురుదాడి చేసింది.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
Read Also: Bharat Mobility Expo: డియో లవర్స్కి శుభవార్త.. స్పోర్టీ లుక్స్, మంచి మైలేజ్..
కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ మేనిఫెస్టోకి ప్రధాని నరేంద్రమోడీ అనుమతి ఉందా.? అని ప్రశ్నించారు. ‘‘ఉచిత పథకాలు ప్రకటించే ముందు ప్రధాని మోదీ అనుమతి తీసుకున్నారా? ఉచితాలా దేశానికి నష్టం కాదని, దేవుడి ప్రసాదమని, ప్రధాని చెప్పంది తప్పుని, కేజ్రీవాల్ చెప్పింది రైట్ అని మోడీ ఒప్పుకోవాలి’’ అని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ ఢిల్లీలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది, ఇవి బీజేపీ వాళ్లకు కూడా అందుతున్నాయని, మాకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియదని, మాకు పనిచేయడమే తెలుసని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బీజేపీ వద్ద ‘‘సంకల్ప్ మేనిఫెస్టో’’ లేదని, కేవలం ‘‘కేజ్రీవాల్ మేనిఫెస్టో’’ ఉందని కేజ్రీవాల్ అన్నారు.
కేజ్రీవాల్ విమర్శలపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా స్పందించారు. ఆప్ ఉచితాలకు, అభివృద్ధి సంక్షేమానికి మధ్య తేడాని అర్థం చేసుకోవాలని అన్నారు. మేనిఫెస్టోని ప్రకటించిన జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఆప్ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు, ఢిల్లీలో, పంజాబ్లో తన వాగ్దానాలను నెరవేర్చలేదని అన్నారు. ఆప్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక మొహల్లా క్లినిక్లను “అవినీతి నిలయం” అని కూడా ఆయన అభివర్ణించారు, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..