Delhi Elections: కేజ్రీవాల్పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఆస్తులు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- భారీగా పెరిగిన న్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆస్తులు
- కేజ్రీవాల్పై పోటీ చేస్తు్న్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోరు నడుస్తోంది. నామినేషన్ల సమర్పణకు గడువు దగ్గర పడింది. ఇంకోవైపు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తు్న్నారు. తాజాగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ అఫిడవిట్ వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.115.62 కోట్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఢిల్లీ అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడిగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక విషయం..రూ. కోటి డిమాండ్..
Also Read
- Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
- Punjab Politics: ఆప్పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
- PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
- CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ నుంచి కేజ్రీవాల్, బీజేపీ నుంచి పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. పర్వేశ్ వర్మ, సందీప్ దీక్షిత్ ఇద్దరూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రుల కుమారులు. మాజీ సీఎం సాహిబ్ సింగ్ శర్మ కుమారుడు పర్వేష్ వర్మ, మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్. ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులు.. ఓ మాజీ ముఖ్యమంత్రిపై పోటీ చేస్తున్నారు.
బీజేపీకి చెందిన పర్వేశ్ వర్మ ఆస్తులు ఐదేళ్లలో రూ.100 కోట్లకు పైగా పెరిగాయి. 2019 ఎన్నికల్లో రూ.15.52 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఐదేళ్లు వచ్చేసరికి దాదాపు రూ.100కోట్లకు పైగా ఆస్తులు పెరిగినట్లుగా పేర్కొన్నారు. తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్లో పర్వేశ్ వర్మనే పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో (2019-2025) చరాస్తులు రూ.3.2 కోట్ల నుంచి రూ.96.50 కోట్లకు పెరిగాయి.
ఇది కూడా చదవండి: SS Thaman: మహేష్ బాబు ఫాన్స్ కి థమన్ మార్క్ కిక్కు..
ఇదిలా ఉంటే మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాల్మీకి కాలనీలో బూట్లు పంపిణీ చేయడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై పర్వేష్ వర్మపై ఢిల్లీ పోలీసులు బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై మందిర్ మార్గ్ ఎస్హెచ్ఓకు ఎన్నికల సంఘం లేఖ రాయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తాను ఆలయం దగ్గర పారిశుధ్య కార్మికుల కాళ్లకు బూట్లు వేసి సన్మానించానని, పాదరక్షలు పంపిణీ చేయలేదని వర్మ పేర్కొన్నారు.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఈసారి ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసింది ఇతడే.. సీసీకెమెరా వీడియో వైరల్..
తాజావార్తలు
-
Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
-
Balayya : బ్రో ఐ డోంట్ కేర్.. సర్జరీ జరిగినా షూటింగ్కు వస్తానంటున్న నట’సింహం’
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడే సందడి… ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ నుంచి ‘జన నాయగన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వరకు!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
ట్రెండింగ్
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!