Samosas: హిమాచల్ప్రదేశ్ను వదలని సమోసా వివాదం.. సీఎంకు బీజేపీ సమోసాలు ఆర్డర్
- హిమాచల్ప్రదేశ్ను వదలని సమోసా వివాదం
- సీఎంకు బీజేపీ ఎమ్మెల్యే 11 సమోసాలు ఆర్డర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ప్రదేశ్ రాజకీయాలను సమోసాల వివాదం ఇంకా కుదిపేస్తోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుకి బీజేపీ ఎమ్మెల్యే 11 సమోసాలను ఆన్లైన్ ఆర్డర్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇది కూాడా చదవండి: Koti Deepotsavam Day 1 LIVE : శంఖాభిషేకం, కోటిమల్లెల అర్చన, కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
గత నెల (అక్టోబర్) 21న ముఖ్యమంత్రి సుఖు.. సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమానికి ఓ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారు. అయితే హోటల్ నుంచి సమోసాలు రాగానే.. వాటిని పోలీసులకు అందజేశారు. అయితే పొరపాటున తమ కొరకే సమోసాలు తెచ్చారేమోనని పోలీస్ సిబ్బంది ఆరగించారు. అయితే వేదికపైకి సమోసాలు రాకపోవడంతో ప్రముఖులు ఆకలితో ఇబ్బందిపడ్డారు. ముఖ్యమంత్రితో సహా ప్రముఖులకు ఈ ఇబ్బంది తలెత్తింది. అయితే సమోసాలు.. లోపలికి వెళ్లకుండా బయటనే సిబ్బంది తినేశారు. అయితే సమోసాలు ఎలా మిస్ అయ్యాయంటూ సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. సమోసాల కోసం సీఐడీ విచారణకు ఆదేశించడమా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అయితే ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి ఖండించారు. ఇదంతా మీడియా సృష్టేనని కొట్టిపారేశారు.
ఇది కూాడా చదవండి: Game Changer Teaser: మైండ్ బ్లాకయ్యేలా గేమ్ ఛేంజర్ టీజర్.. చూశారా?
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆశిశ్ శర్మ.. ముఖ్యమంత్రి సుఖుకు 11 సమోసాలను ఆన్లైన్ ఆర్డర్ పెట్టారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ.. ‘‘నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలతో రాష్ట్రం అల్లాడిపోతుంటే.. సమోసాల విషయంలో సీఐడీ విచారణకు ఆదేశించించడం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రికి 11 సమోసాలు పంపాను. ఆయనకు ప్రజా సమస్యలను గుర్తుచేసేందుకే అలా చేశాను’’ అని శర్మ వెల్లడించారు. మరోవైపు శుక్రవారం రాత్రి బీజేపీ సీనియర్ నేత, హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్.. బీజేపీ శ్రేణులకు సమోసా పార్టీ ఇచ్చి ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు.
ఇది కూాడా చదవండి: Rain Alert: అలర్ట్.. మరి కొన్ని గంటల్లో ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..