Tejashwi Yadav: ప్రశాంత్ కిషోర్కి బీజేపీ నిధులు.. ఎన్నికల వ్యూహమని తేజస్వీ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. ఈసారి కూడా ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ, ఎన్డీయే కూటమి అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అయితే బీజేపీ చెబుతున్న ప్రకారం సొంతగా 370 సీట్లు, ఎన్డీయేకి 400+ సీట్లు మాత్రం వచ్చే అవకాశం లేదని చెప్పారు. 2019 ఫలితాలకు సమానంగా లేకపోతే కాస్త ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, ఆయన అంచనాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పార్టీలు విరుచుకుపడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఎజెంట్ అని విమర్శించడం మొదలుపెట్టాయి.
Read Also: US warning: వెనిజులా వెళ్లొద్దని పౌరులకు అమెరికా హెచ్చరిక
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
తాజాగా లాలూ పార్టీ ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ శుక్రవారం మాట్లాడుతూ.. ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంట్ అని, బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతుందని తెలిసే ఓ కథనాన్ని సెట్ చేయాడానికి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. అమిత్ షా కోరిక మేరకే ప్రశాంత్ కిషోర్ను జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిని చేశానని, నితీష్ కుమార్ కూడా చెప్పారని, ఇప్పటి వరకు అమిత్ షా, ప్రశాంత్ కిషోర్ కానీ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదని, ఆయన బీజేపీతో ఉన్నారని అన్నారు.
ప్రశాంత్ కిషోర్ జీతాలు తీసుకునే జిల్లా అధ్యక్షులను పెట్టుకున్నాడని, ఇది బీజేపీకి కూడా లేదని, అతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదని, అతను ప్రతీ ఏడాది వేర్వేరు వ్యక్తులతో పనిచేస్తుంటారని, అతను మీ డేటాను తీసుకుని వస్తారు, అతను బీజేపీ ఏజెంట్ మాత్రమే కాదని, బీజేపీ మైండ్ అని, వారి సిద్ధాంతాలను అనుసరిస్తారని బీజేపీ వ్యూహంలో భాగంగా అతనికి నిధులు వస్తున్నాయని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. ఇటీవల బీజేపీ ప్రశాంత్ కిషోర్ని జాతీయ అధికార ప్రతినిధిగా నియమించుకుందనే ఓ ఫేక్ న్యూస్ వైరల్ అయిన తర్వాత తేజస్వీ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!