National Herald Case: సోనియా, రాహుల్పై బీజేపీ ఘాటు విమర్శలు
- సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు
- నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారని ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్షీట్లో పొందుపరిచింది. తాజాగా ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ ఖండిస్తోంది. చట్టం తన పని తాను చేసుకునిపోతుందని బీజేపీ చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: KTR: సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన బిఆర్ఎస్ పార్టీ
Also Read
- Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
- Tamil Nadu Debt Crisis: పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు.. శ్వేతపత్రంలో సంచలన విషయాలు
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
తాజాగా బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఘాటు విమర్శలు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ.. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసి నేషనల్ హెరాల్డ్కు ఇచ్చే హక్కు లేదన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ప్రజల గొంతును బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ఈ వార్తా పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారని ఆరోపించారు. ఈ కేసును కొట్టివేయించడానికి సోనియాగాంధీ, రాహుల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. అక్రమాలకు పాల్పడినవారు తప్పించుకోవడానికి ఇది కాంగ్రెస్ పాలన కాదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Shreyas Iyer-Chahal: చహల్కు శ్రేయస్ దిశానిర్దేశం.. ఏం చెప్పాడంటే?
ఇక రవిశంకర్ ప్రసాద్ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ మాట్లాడుతూ.. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. మేము న్యాయ వ్యవస్థను విశ్వసిస్తామని.. దీనిపై మేము చట్టబద్ధంగా పోరాడి న్యాయం పొందుతామని చెప్పారు. ప్రతిపక్షాల గొంతును అణిచివేయడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వానికి ఎటువంటి ఆధారాలు లేవని.. కేవలం ప్రతిపక్షాల ప్రతిష్టను దిగజార్చాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Pastor Praveen Pagadala: ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ విచారణ కోసం పిల్.. హైకోర్టు కీలక ఆదేశాలు
#WATCH | Delhi | On ED's prosecution complaint against Rahul Gandhi, Sonia Gandhi and others in alleged National Herald money laundering case, BJP MP Ravi Shankar Prasad says, "Congress party has the right to protest, but it does not have the right to misappropriate government… pic.twitter.com/t2mbQknwPY
— ANI (@ANI) April 16, 2025
తాజావార్తలు
-
FIFA World Cup: సెనెగల్పై ‘కిలియన్ ఎంబాపే’ డబుల్ ట్రీట్.. 3-1 తేడాతో విజయం.!
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ మూవీ స్టోరీ లీక్
-
Explained: యుద్ధంలో ట్రంప్ ఘోర పరాజయం.. ప్రపంచం ముందు నవ్వులపాలైన అమెరికా!
-
Fake Currency Scam: రూపాయి ఇస్తే మూడు రూపాయలు.. నకిలీ నోట్ల ఆశతో 14 లక్షలు పోగొట్టుకున్న అన్నదమ్ములు!
-
Crime News: రహస్యంగా పెళ్లి.. చివరకి భార్యకు విషం తాగించి, గొంతు నులిమి చంపాడు.. భర్తను పట్టించిన ఇన్స్టా స్టోరీ!
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!