Delhi: ఆప్కు షాక్.. ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సీటు బీజేపీ కైవసం
- ఢిల్లీలో ఆప్కు షాక్
- ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సీటు బీజేపీ కైవసం
- బీజేపీకి చెందిన సుందర్ సింగ్ తన్వర్ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీకి చెందిన సుందర్ సింగ్ తన్వర్ ఢిల్లీ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ సీటును కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి సుందర్ సింగ్ 115 ఓట్లు గెలుచుకోగా.. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాలేదు. ఆప్ అధిష్ఠానం నిర్ణయం మేరకు ఆ పార్టీ కౌన్సిలర్లు ఈ ఎన్నికలను బహిష్కరించారు. ఇక తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉన్న కాంగ్రెస్ సైతం ఓటింగ్కి దూరంగా ఉంది. దీంతో పోటీ లేకుండానే బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. అడిషనల్ కమిషనర్ జితేంద్ర యాదవ్ ఈ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు.
ఇది కూడా చదవండి: Maldives president: అక్టోబర్లో భారత్లో ముయిజ్జు పర్యటన.. ప్రధాని మోడీతో చర్చలు
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
బీజేపీ నేత కమల్జిత్ షెరావత్ వెస్ట్ ఢిల్లీ ఎంపీగా ఎన్నిక అయ్యారు. దీంతో ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సభ్యుని పదవికి ఖాళీ ఏర్పడింది. గత గురువారం జరిగిన ఎంసీడీ సమావేశంలో ఎంసీడీ స్టాండిగ్ కమిటీ ఎన్నికను అక్టోబర్ 5వ తేదీకి మేయర్ షెల్లీ ఒబెరాయ్ వాయిదా వేశారు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఈ వాయిదాను తోసిపుచ్చుతూ శుక్రవారం ఒంటిగంటకు ఎన్నికలు నిర్వహించాలంటూ ఎంసీడీ కమిషనర్ను ఆదేశించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ గురువారం ఆర్ధరాత్రి ఆదేశాలు జారీ చేశారు. కమిటీ ఆరో సీటు ఎన్నికకు ప్రిసైడ్ చేయాలని అడిషనల్ మునిసిపల్ కమిషనర్ జితేంద్ర యాదవ్ను ఆదేశించారు. అయితే ఇంత స్వల్ప వ్యవధిలో ఎన్నికకు ఆదేశాలివ్వడం చట్టవిరుద్ధమని, షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5న ఎన్నికలు జరపాలని మేయర్ ఒబెరాయ్ డిమాండ్ చేసారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్కు లేఖ రాశారు. అయితే ఎల్జీ ఆదేశాలకే కట్టుబడి స్టాండింగ్ కమిటీ సభ్యుని ఎన్నికను కమిషనర్ చేపట్టడంతో ఓటింగ్కు ఆప్ కౌన్సిలర్లు దూరంగా ఉండిపోయారు. తాజా ఎన్నికతో ఎంసీడీలోని 18 మంది సభ్యుల స్టాడింగ్ కమిటిలో బీజేపీ బలం 10కి చేరింది. ఆప్కు 8 సీట్ల బలం ఉంది.
ఇది కూడా చదవండి: Monkeypox Case: భారత్లో మరో మంకీపాక్స్ కేసు.. ఒకే రాష్ట్రంలో రెండు కేసులు
లెప్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ‘ప్రజాస్వామ్యంలో మనం జీవిస్తున్నాం.. సభకు ఎప్పుడు 72 గంటలు ఇస్తాం అని చట్టంలో రాసి ఉంది.. ప్రతి కౌన్సిలర్కు సమయం కావాలి.. వారి ఉద్దేశాల్లో ఏదో లోపం కనిపిస్తోంది.. ఏదో చేయాలనే కుట్ర కనిపిస్తోంది. అందుకే ఇదంతా చేస్తున్నారు…’’ అని కేజ్రీవాల్ అన్నారు. న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు ఆప్ రెడీ అవుతోంది.
తాజావార్తలు
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
-
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!