NTV Telugu Site icon

PM Modi: ప్రధాని మోడీ టార్గెట్‌గా కాంగ్రెస్ హింసను ప్రేరేపిస్తోంది..

Bjp

Bjp

PM Modi: ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ హింసను ప్రేరేపిస్తోందని బీజేపీ ఆరోపించింది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ‘హత్య’, ‘హింస’ అనే పదాలను ఉపయోగించరాని పేర్కొంది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నాన్ని ప్రస్తావిస్తూ.. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు హింసను ప్రేరేపిస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి రాసిన లేఖను బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది హైలెట్ చేశారు.

Read Also: Bhadradri Kothagudem: అధికారుల నిర్లక్ష్యం..వరదల్లో చిక్కుకున్న 15మంది కూలీలు

కాంగ్రెస్‌ని, దాని నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో హింస, హత్య వంటి పదాలను ఉపయోగించారని, ఎన్నికల ప్రచారంలో మోడీ కాన్వాయ్‌పై కొన్ని వస్తువులు విసిరినట్లు, ప్రధాని అంతంగా చిత్రీకరించి ప్రజల్లో భయాలను నింపారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని మోడీ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, దీనికి భిన్నంగా కాశ్మీర్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో రాహుల్ గాంధీకి భద్రత కల్పించామని చెప్పారు.

మోడీని ముక్కులగా నరికేయాలని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారని, 2007లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ అధినేత్రి మోడీని ‘మౌత్ కా సౌదాగర్’ అంటూ ఆరోపించడాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతగా గాంధీ తన ప్రసంగాల్లో పరిణితి చూపాలని, అలా చేయని వ్యక్తి రాజకీయాలకు తగడని అన్నారు.