Bihar: భూ మాఫియా వేధిస్తోంది.. ఉపముఖ్యమంత్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సైనికుడు
- భూ మాఫియా వేధిస్తోంది
- ఆత్మహత్యే శరణ్యం అంటూ వేదన
- ఉపముఖ్యమంత్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సైనికుడు
బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ముందు ఒక సైనికుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. భూ మాఫియా తమ కుటుంబాన్ని వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సహదేశ్ కుమార్.. భారత సైన్యంలో సైనికుడు. బీహార్లోని ఛప్రా నగరంలో భిఖారీ ఠాకూర్ ఆడిటోరియంలో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ప్రజా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. వేదికపైకి సైనికుడు సహదేశ్ కుమార్ వచ్చి డిప్యూటీ సీఎం ముందు తన గోడు వెళ్లబుచ్చుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
తమ కుటుంబం భూ మాఫియా కారణంగాతీవ్ర ఇబ్బందులకు గురవుతోందని.. భూ వివాదం కారణంగా తన తండ్రి మరణించారని, ఇప్పుడు తన మామ బ్రెయిన్ హెమరేజ్కు గురయ్యారని చెప్పాడు. తాను మాఫియాతో పోరాడలేకపోతున్నానని.. ఎంత నిస్సహాయంగా ఉన్నానంటే ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచిస్తున్నానని తెలిపాడు. ‘‘నాకు నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వాళ్లకి పెళ్లి ఎలా చేయాలి? నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్?. న్యాయం జరగకపోతే అదే శరణ్యం.. మేము కోర్టుకు వెళ్లే స్థితిలో లేము. మేము పని చేయాలా లేక కోర్టుకు వెళ్లాలా? సార్?.’’ అడిగాడు.
భావోద్వేగానికి గురవుతున్న సైనికుడిని ఉప ముఖ్యమంత్రి శాంతింపజేశారు. ఆత్మహత్య పిరికితనమని అన్నారు. ‘‘నువ్వు వెళ్లిపోతే నీ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? నువ్వు ఇతరులను కాపాడితే.. నీకు న్యాయం జరుగుతుంది. మనం నేరస్థులకు భయపడితే.. వారు మనపై దాడి చేస్తారని నేను అందరికీ చెబుతాను.’’ అని అన్నారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా.. ఈ విషయాన్ని పరిశీలించి, భూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టంగా తెలిపారు. అటువంటి వ్యక్తులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేసి, భూమిని విడిపించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్లో ఇంకా విధ్వంసం మొదలవ్వలేదు.. భారీ వంతెన కూల్చిన తర్వాత ట్రంప్ ప్రకటన
ఇది కూడా చదవండి: Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?