2 Rupees Bribe: 2 రూపాయల లంచం.. 37 ఏళ్ల సుదీర్ఘ విచారణ.. చివరికి తుది తీర్పు ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Courts Dismissed 2 Rupees Bribe Case On 5 Police Constables After 37 Years: కొన్ని కేసుల విచారణలు ఎక్కువకాలం నడుస్తాయన్న విషయం అందరికీ తెలుసు. అవినీతి కేసులు కూడా కొన్ని సంవత్సరాల వరకు సాగుతాయి కానీ, మరీ 37 సంవత్సరాలు సాగిన దాఖలాలైతే లేవు. కానీ.. ఒక కేసు విచారణ మాత్రం అంత సుదీర్ఘకాలం వరకు నడిచింది. అది కూడా లక్షల్లో, కోట్లలో అవినీతి జరగలేదు. కేవలం రెండే రెండు రూపాయల అవినీతి జరిగిన కేసు అది. వాహనదారుల నుంచి ఐదుగురు పోలీసులు రూ.2 లంచం తీసుకున్నారని 1986లో నమోదైన ఈ కేసులో.. ఇన్నేళ్ల తర్వాత వాళ్లు నిర్దోషులంటూ బిహార్లోని ఒక కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Tilak Varma Sixes: తొలి 3 బంతుల్లో 2 సిక్స్లు.. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అరంగేట్రమే అదుర్స్!
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
భాగల్పుర్ పరిధిలోని ఓ చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు పోలీసులు.. వాహనదారుల నుంచి రూ.2 లంచం వసూలు చేస్తున్నారని బెగుసరాయ్ ఎస్పీ అరవింద్ వర్మకు ఫిర్యాదులు అందాయి. 1986 జూన్ 10వ తేదీన ఒక వ్యక్తి నుంచి ఆయనకు ఈ ఫిర్యాదు అందింది. దీంతో వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకోవాలని ఎస్పీ భావించారు. అందుకు ఒక ప్రణాళిక రూపొందించారు. చెక్పోస్ట్ వైపుగా వెళుతున్న ఓ వాహనాన్ని ఆపి.. రూ.2 నోటుపై తన సంతకం చేసి, ఆ నోటును డ్రైవర్కు ఇచ్చారు. ఒకవేళ పోలీసులు లంచం అడిగితే.. తాను సంతకం చేసిన నోటునే వారికి ఇవ్వాలని సూచించారు. అనంతరం.. వాహనదారుడు చెక్పోస్ట్ వద్దకు చేరుకోగానే.. పోలీసులు అతనికి రూ.2 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఆ డ్రైవర్ ఎస్పీ సంతకం చేసిచ్చి నోటుని ఒక కానిస్టేబుల్కు ఇచ్చాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఎస్పీకి తెలియజేశాడు.
Mamata Banerjee: అమిత్ షా చెప్పింది కరెక్టే.. బిగ్ షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ
ఎట్టకేలకు తనకు వచ్చిన ఫిర్యాదు నిజమేనని నిర్ధారించుకున్న ఆ ఎస్పీ.. వెంటనే చెక్పోస్ట్ వద్దకు వెళ్లారు. కానిస్టేబుల్ జేబులో నుంచి తాను సంతకం చేసిచ్చిన నోటును స్వాధీనం చేసుకొని.. ఆ ఐదుగురు పోలీసులపై కేసు నమోదు చేశారు. అలా 1986 నుంచి మొదలైన ఈ కేసు విచారణ.. 2023 ఆగస్టు దాకా సాగింది. చివరికి.. సరైన ఆధారాలు లేకపోవడంతో కేసుని కొట్టివేస్తూ.. రామరతన్ శర్మ, కైలాష్ శర్మ, జ్ఞాని శంకర్, యుగేశ్వర్ మహ్తో, రామ్ బాలక్ రాయ్ అనే ఐదుగురు పోలీసుల్ని కోర్టు నిర్దోషులుగా తేల్చింది.
తాజావార్తలు
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!