MCD Election: మేయర్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్ తప్పదా? ఆమ్ఆద్మీకి కొత్త టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆమ్ఆద్మీ పార్టీ.. తొలిసారి ఎంసీడీలో పాగా వేసింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరదించేలా సీట్లు సాధించింది.. మొత్తం 250 వార్డులకు గాను మేజిక్ ఫిగర్ 126 సీట్లు ఉండగా.. అంతకంటే ఎక్కువగానే అంటే ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించింది.. ఇక, బీజేపీ 104 స్థానాలకు పరిమితం అయ్యింది.. ఒకప్పుడు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఘోర ఓటమి తప్పలేదు.. కేవలం 9 వార్డులకే పరిమితమైంది. ఇక, ఇండిపెండెంట్లు మూడు స్థానాల్లో విజయం సాధించారు.. అయితే, ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడం ఇదే తొలిసారి.. ఢిల్లీ అసెంబ్లీలో రెండుసార్లు విజయం సాధించినా.. కార్పొరేషన్లో ఇదే తొలిసారి కావడంతో.. సంబరాల్లో మునిగిపోయాయి ఆ పార్టీ శ్రేణులు.. ఇంతవరకు బాగానే ఉన్నా.. మేయర్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ తప్పదా? అనే టెన్షన్ ఆమ్ఆద్మీ పార్టీని వెంటాడుతోంది.
Read Also: CM Jagan : పార్టీ నేతలతో నేడు సీఎం జగన్ సమీక్ష
Also Read
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ఇప్పటికే, బీజేపీ తన గేమ్ప్లాన్ మొదలు పెడుతుందనే ఆప్ నేతలు వ్యాఖ్యానించారు.. అయినా, తమ కార్పొరేటర్లు ప్రలోభాలకు గురికారని చెబుతున్నారు.. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది.. మెజార్టీ స్థానాలు సాధించిన ఆప్కు బీజేపీ షాక్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు 12 మంది కౌన్సి లర్లను నియమించే అధికారం ఉంది.. ఆయన గనక 12 మంది బీజేపీకి చెందినవాళ్లనే నియమిస్తే.. మేయర్ ఎన్నికలో ఉత్కంఠ తప్పదు.. ప్రస్తుతం బీజేపీకి 104 మంది కౌన్సిలర్ల ఉండగా.. లెఫ్టినెంట్ గవర్నర్ 12 మందిని ఆ పార్టీకి చెందినవారినే నియమిస్తే మాత్రం.. ఆ పార్టీ సభ్యుల సంఖ్య 116కు చేరనుంది.. అయినా నష్టం లేదు అనుకోవచ్చు.. ఎందుకంటే ఆప్కు 134 మంది సభ్యులు ఉన్నారు గనుక మేయర్ కావడం సులువే అనుకోవచ్చు.. అయితే, ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది.. అసెంబ్లీ ఎన్నికల తరహాలో మేయర్ ఎన్నికకు ఫిరాయింపుల చట్టం వర్తించబోదు.. అంటే.. ఒకపార్టీలో గెలిచి మరో పార్టీలో చేరినా ఆపే శక్తి.. అతడిని పోటీలో నిలిపిన పార్టీకి ఉండదు.. పార్టీలు విప్ జారీ చేయడానికి కూడా వీలు ఉండదు.. మరోవైపు, కాంగ్రెస్ నుంచి 9 మంది, ఇండిపెండెంట్లు ముగ్గురు విజయం సాధించారు.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చేసినట్టు.. కొందరు కార్పొరేటర్లపై కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందంటే.. ఢిల్లీ మేయర్ పీఠం మరోసారి బీజేపీ వశం కావడం గ్యారంటీ.. దీంతో, ఢిల్లీలో ఏం జరుగుతోంది అనేది ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
OTR: ఒకప్పుడు ఊపు ఊపిన మాజీ ఎంపీ.. ఇప్పుడు బలవంతంగా జీపులోకి ఎక్కించిన పోలీసులు..
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
OTR: జగ్గారెడ్డి కమిషన్ రిపోర్ట్లో ఏముంది..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!