Bharat Jodo Yatra: మరో వివాదంలో రాహుల్ గాంధీ.. ఆ వ్యక్తిని కలవడంపై బీజేపీ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra.. Rahul Gandhi in another controversy: భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. గతంలో భారతదేశాన్ని, హిందూ మతాన్ని తక్కువ చేస్తూ మాట్లాడిని వివాదాస్పద క్రైసవ మతగురువు ఫాదర్ జార్జ్ పొన్నయ్యతో భేటీ అయ్యారు. అయితే దీనిపై బీజేపీ రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టింది. భారత్ తోడో( భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయండి) గుర్తులతో భారత్ జోడోనా..? అని ప్రశ్నించింది. వివాదాస్పద ఫాదర్ జార్జ్ పొన్నయ్యను రాహుల్ గాంధీ కలవడంపై బీజేపీ అధికార ప్రతినిధి హెషజాద్ పునావాలా ట్విట్టర్ లో విమర్శలు చేశారు.
2021లో జార్జ్ పొన్నయ్య ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, డీఎంకే నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేశారు పొన్నయ్య. భారత మాత మలినాలు మమ్మల్ని కలుషితం చేయకూడదు కాబట్టి నేను బూట్లు ధరిస్తానని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ షేర్ చేసిన వీడియోలో ఏసుక్రీస్తుపై రాహుల్ గాంధీ, జార్జ్ పొన్నయ్యపై సంభాషణ జరుగుతుంది. ఏసుక్రీస్తు నిజమైన దేవుడా..? అని ప్రశ్నించినప్పుడు.. పొన్నయ్య మనిషి రూపంలో ఉన్న దేవుడు ఏసుక్రీస్తు అంటూ సమాధానం ఇవ్వడం మనకు కనిపిస్తుంది.
Also Read
Read Also: Lalitha Jewellery In Chandanagar: చందానగర్ లో లలితా జ్యూవెలరీ షోరూం ప్రారంభం
బీజేపీ ట్వీట్ చేసిన పోస్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. మహాత్మాగాంధీ హత్యకు, నరేంద్ర దభోల్కర్, గోవింద్ పండరే, ఎంఎం కల్బుర్గి, గౌరీ లంకేశ్ వంటి వ్యక్తుల హత్యలకు కారణమైన వ్యక్తులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. “ఏమిటి ఈ జోక్.. భారత్ జోడో యాత్ర స్ఫూర్తిని దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలు ఘోరంగా విఫలమవుతాయి” అని బీజేపీని ఉద్దేశించి జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందన చూసి బీజేపీ నిరాశ చెందుతుందని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయింది. 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా యాత్ర కొనసాగుతుంది. మొత్తం 3570 కిలోమీటర్ల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర కాశ్మీర్ లో ముగుస్తుంది.
George Ponnaiah who met Rahul Gandhi says “Jesus is the only God unlike Shakti (& other Gods) “
This man was arrested for his Hindu hatred earlier – he also said
“I wear shoes because impurities of Bharat Mata should not contaminate us.”Bharat Jodo with Bharat Todo icons? pic.twitter.com/QECJr9ibwb
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) September 10, 2022
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
-
Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్లో మెగా బ్రదర్స్ .. చిరు – బాబి మూవీ ఓపెనింగ్లో ‘మెగా’ హ్యాపీనెస్
-
Ajinkya Rahane: “మా విజయ రహస్యం ఇదే”.. కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన కెప్టెన్ రహానే
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!