Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు
- జూన్ 12న మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి
- భారతదేశ సరిహద్దుల వెలుపల నడిచే మొట్టమొదటి "భారత్ గౌరవ్" రైలు ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నేపాల్కు మొట్టమొదటి “భారత్ గౌరవ్” పర్యాటక రైలును ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ రైలు ప్రయాణికులకు పొరుగు దేశంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, సందర్శన అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రత్యేక “పశుపతినాథ్ నేపాల్ దర్శన్ యాత్ర” జూన్ 12న మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి బయలుదేరుతుంది. భారతదేశ సరిహద్దుల వెలుపల నడిచే మొట్టమొదటి “భారత్ గౌరవ్” రైలు ఇదే అవుతుంది. దీనిని ఒక సాధారణ రైలు సర్వీసుగా కాకుండా, ఒక గైడెడ్ టూరిజం ప్యాకేజీగా రూపొందించారు.
రైలు ఎక్కడికి వెళ్తుంది?
Also Read
- Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
- UNEP: భారత్కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
- IndiGo Plane Hits Pole: ఎయిర్పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్ను ఢీకొన్న ఫ్లైట్!
- Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్కి రెడీ!
కాఠ్మండు
పశుపతినాథ్ ఆలయం
పోఖారా
చిత్వాన్ జాతీయ ఉద్యానవనం
మనకామన ఆలయం
ఈ యాత్రకు ఎన్ని రోజులు పడుతుంది?
నేపాల్లోని పశుపతినాథ్ ఆలయానికి రైలు ప్రయాణం తొమ్మిది రాత్రులు, 10 రోజుల పాటు సాగుతుంది. ఈ ప్రయాణంలో నేపాల్లోని అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలు కొన్ని సందర్శించొచ్చు. IRCTC ప్రకారం, ఈ టూర్ ప్యాకేజీలో మనకామన ఆలయానికి రోప్వే ప్రయాణం, చిత్వాన్ నేషనల్ పార్క్ లోపల జీప్ సఫారీ కూడా చేర్చారు.
ఇండోర్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించే ఈ రైలు, ఉజ్జయిన్, షుజల్పూర్, సెహోర్, భోపాల్, ఇటార్సీ, నర్సింగ్పూర్, జబల్పూర్, కట్నీ, సత్నా స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు ఈ స్టేషన్లలో ఎక్కడినుండైనా టిక్కెట్లు బుక్ చేసుకొని తమ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఈ డీలక్స్ ఏసీ పర్యాటక రైలులో మొత్తం 14 కోచ్లు ఉంటాయి, వీటిలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ తరగతి సీట్లు అందుబాటులో ఉంటాయి. రైలులోనే భోజనం చేయడానికి ఐఆర్సిటిసి రెండు రెస్టారెంట్ కోచ్లను కూడా ఏర్పాటు చేసింది, ఇక్కడ మీరు మీకు ఇష్టమైన వంటకాలను ఆస్వాదించవచ్చు.
ఛార్జీలు
థర్డ్ ఏసీ కంఫర్ట్ – ఒక్కొక్కరికి రూ. 62,710
సెకండ్ ఏసీ డీలక్స్ – ఒక్కొక్కరికి రూ. 76,550
ఫస్ట్ ఏసీ సుపీరియర్ – ఒక్కొక్కరికి రూ. 90,400
ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు
రైలు ప్రయాణం
3-స్టార్ హోటళ్లలో వసతి
శాకాహార ఆహారం
స్థానిక సందర్శనీయ స్థలాలు, ఏసీ బస్సుల ద్వారా రవాణా
ప్రయాణ బీమా
టూర్ ఎస్కార్ట్లు (గైడ్లు)
గృహనిర్వహణ, భద్రతా సేవలు
టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలి
భారత్ గౌరవ్ రైలులో మీ సీటును బుక్ చేసుకోవడానికి, మీరు IRCTC పర్యాటక వెబ్సైట్ను సందర్శించాలి, అక్కడ నుండి మీరు ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
-
Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
-
Shruti Haasan: AI డీప్ఫేక్లపై శృతి హాసన్కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!