Benjamin Netanyahu: ప్రపంచం వ్యతిరేకించినా భారత్ మాత్రం ఇజ్రాయెల్తోనే
- భారత్పై ప్రేమ వ్యక్తం చేసిన నెతన్యాహూ
- భారత్-ఇజ్రాయిల్ బంధంపై కీలక వ్యాఖ్యలు
- అమెరికాలో తగ్గుతున్న ఇజ్రాయిల్ ఆదరణపై ఆందోళన
- పాకిస్తాన్ బాట్ ఫార్మ్లపై సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benjamin Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ భారత్పై మరోసారి తన అభిమానాన్ని, ప్రేమను చాటుకున్నారు. భారత్ గురించి గొప్పగా చెప్పారు. భారత్-ఇజ్రాయిల్ మధ్య బంధం చాలా గాఢమైందని ఆయన చెప్పుకొచ్చారు. గురువారం వెస్ట్ బ్యాంక్లో జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భారత్ అనే భారీ శక్తితో ఇజ్రాయిల్కు ఉన్న ప్రత్యేక సంబంధంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో చాలా దేశాలతో మాకు సమస్యలు ఉన్నాయి, కానీ భారత్తో లేవు అని అన్నారు. భారత్లో ఇజ్రాయిల్కు చాలా క్రేజ్ ఉందని, విపరీతమైన మద్దతు ఉందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ నుంచి ఇజ్రాయిల్కు చాలా మంది ఫాలోవర్లు ఉన్నారని ఆయన అన్నారు.
భారత్ గురించి నెతన్యాహూ గొప్పగా చెప్పడం ఇదే తొలిసారి కాదు. 2018లో ఆయన తన భార్య సారాతో కలిసి న్యూఢిల్లీ వచ్చినప్పుడు, ఆ పర్యటనను ‘‘లవ్ ఫెస్టివల్’’గా అభివర్ణించారు. భారతీయులకు ఇజ్రాయిల్ పట్ల అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. తాజాగా జరిగిన సమావేశంలో నెతన్యాహూ మాట్లాడుతూ, భారత్లో 140 కోట్ల జనాభా ఉందని, అక్కడ ఇజ్రాయిల్కు చాలా ఆదరణ ఉందని చెప్పారు. ప్రధాని మోడీ ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని స్వాగించారని ఆయన సీబీఎస్ న్యూస్ ‘‘60 మినట్స్’’ కార్యక్రమంలో అన్నారు.
Also Read
- E20 Petrol: ఈ20 పెట్రోల్పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
ఇటీవల కాలంలో అమెరికన్లలో ఇజ్రాయిల్ పట్ల ఆదరణ తగ్గుతోందనే నివేదికల నేపథ్యంలో నెతన్యాహూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఏప్రిల్లో డుదలైన తాజా ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం, అమెరికాలోని 60% మంది వయోజనులు ఇజ్రాయెల్ పట్ల ప్రతికూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్లు తేలింది. గత ఏడాది ఇది 53 శాతంగా ఉండేది. తన పేరును తగ్గించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని నిందించారు. అమెరికా ప్రజల అభిప్రాయంలో ఇజ్రాయిల్ వ్యతిరేకతను పెంచడానికి పాకిస్తాన్ సోషల్ మీడియా బాట్ ఫార్మ్లను ఉపయోగిస్తుందని ఆరోపించారు. అమెరికా-ఇజ్రాయిల్ కూటమిని బలహీనపరచడానికి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
-
Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
-
Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
-
WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!