Afghanistan: ప్రపంచ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ ఎదుగుదలలో భారత్ కీలక పాత్ర.. ఏం చేసిందంటే..
- టీ-2 వరల్డ్ కప్లో సత్తా చాటుతున్న ఆఫ్ఘనిస్తాన్..
- పసికూన ముద్ర చెరిపేసుకున్న జట్టు..
- క్రికెట్ ప్రపంచంలో నయా సంచనలం..
- ఆఫ్ఘాన్ ఎదుగుదలలో భారత్ కీలక పాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan: ప్రపంచ క్రికెట్లో నిన్నమొన్నటి వరకు పసికూనగా పిలుపుకునే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు సింహంలా గర్జిస్తోంది. హేమాహేమీల లాంటి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి జట్లను మట్టికరిపించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఆకట్టుకుంటోంది. ఆఫ్ఘాన్ ధాటికి ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. టీ 20 వరల్డ్ కప్లో ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ తో పాటు సెమీస్కి దూసుకెళ్లింది.
అయితే, క్రికెట్ ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ ఎదుగుదలలో భారత్ కీలక పాత్ర పోషించింది. బీసీసీఐ ఆఫ్ఘాన్ క్రికెట్ ఎదుగుదలకు తోడ్పాటునందించింది. ఇండియాలోని గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ ఫాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మొదటిసారిగా 2015లో ఆఫ్ఘనిస్తాన్కి ‘‘హోమ్ గ్రౌండ్’’గా మారింది. ఆఫ్ఘనిస్తాన్ తన స్థావరాన్ని షార్జా నుంచి నోయిడాకు మార్చింది. 2017లో గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది.నోయిడా మాత్రమే కాదు డెహ్రాడూర్లో బంగ్లాదేశ్తో జరిగిన టీ-20 సిరస్కి ఆతిథ్యం ఇచ్చింది.
Also Read
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
Read Also: Indians In Kenya: “కెన్యాలోని భారతీయులు జాగ్రత్త”.. హింస నేపథ్యంలో కేంద్రం కీలక సూచన..
బీసీసీఐ ఆఫ్ఘాన్కి సౌకర్యాలు కల్పించడమే కాదు, భారత మాజీ క్రికెటర్లు కోచింగ్ కూడా సహకరించింది. లాల్చంద్ రాజ్పుత్, మనోజ్ ప్రభాకర్, అజయ్ జడేజాలు గతంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కోచ్గా పనిచేశారు. వన్డే ప్రపంచకప్-2023 వరకు జడేజా ఆ టీం మెంటర్గా ఉన్నారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రికెట్ బోర్డు అయిన BCCI, రెండు దేశాలు మరియు జట్ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక పెద్ద ముందడుగు వేసి, బెంగళూరులో జట్టు తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు అప్పటి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని కూడా ఆహ్వానించింది. రెండు దేశాల మధ్య సంబంధాలకు క్రికెట్ ఒక వారధిగా మారింది.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ కూడా ఆఫ్ఘాన్ క్రికెటర్లు రాటుదేలేందుకు సహకరించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్తో సహా పలువురు ఆటగాళ్లు ఐపీఎల్లోని పలు టీముల్లో ఆడుతున్నారు. దీంతో వారికి ఇంటర్నేషనల్ ప్లేయర్లతో ఆడే వెసులుబాటు కలగడంతో పాటు క్రికెట్ మెలకువలు తెలుసుకున్నారు.
తాజావార్తలు
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!