Afghanistan: ప్రపంచ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ ఎదుగుదలలో భారత్ కీలక పాత్ర.. ఏం చేసిందంటే..
- టీ-2 వరల్డ్ కప్లో సత్తా చాటుతున్న ఆఫ్ఘనిస్తాన్..
- పసికూన ముద్ర చెరిపేసుకున్న జట్టు..
- క్రికెట్ ప్రపంచంలో నయా సంచనలం..
- ఆఫ్ఘాన్ ఎదుగుదలలో భారత్ కీలక పాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan: ప్రపంచ క్రికెట్లో నిన్నమొన్నటి వరకు పసికూనగా పిలుపుకునే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు సింహంలా గర్జిస్తోంది. హేమాహేమీల లాంటి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి జట్లను మట్టికరిపించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఆకట్టుకుంటోంది. ఆఫ్ఘాన్ ధాటికి ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. టీ 20 వరల్డ్ కప్లో ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ తో పాటు సెమీస్కి దూసుకెళ్లింది.
అయితే, క్రికెట్ ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ ఎదుగుదలలో భారత్ కీలక పాత్ర పోషించింది. బీసీసీఐ ఆఫ్ఘాన్ క్రికెట్ ఎదుగుదలకు తోడ్పాటునందించింది. ఇండియాలోని గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ ఫాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మొదటిసారిగా 2015లో ఆఫ్ఘనిస్తాన్కి ‘‘హోమ్ గ్రౌండ్’’గా మారింది. ఆఫ్ఘనిస్తాన్ తన స్థావరాన్ని షార్జా నుంచి నోయిడాకు మార్చింది. 2017లో గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది.నోయిడా మాత్రమే కాదు డెహ్రాడూర్లో బంగ్లాదేశ్తో జరిగిన టీ-20 సిరస్కి ఆతిథ్యం ఇచ్చింది.
Also Read
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
Read Also: Indians In Kenya: “కెన్యాలోని భారతీయులు జాగ్రత్త”.. హింస నేపథ్యంలో కేంద్రం కీలక సూచన..
బీసీసీఐ ఆఫ్ఘాన్కి సౌకర్యాలు కల్పించడమే కాదు, భారత మాజీ క్రికెటర్లు కోచింగ్ కూడా సహకరించింది. లాల్చంద్ రాజ్పుత్, మనోజ్ ప్రభాకర్, అజయ్ జడేజాలు గతంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కోచ్గా పనిచేశారు. వన్డే ప్రపంచకప్-2023 వరకు జడేజా ఆ టీం మెంటర్గా ఉన్నారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రికెట్ బోర్డు అయిన BCCI, రెండు దేశాలు మరియు జట్ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక పెద్ద ముందడుగు వేసి, బెంగళూరులో జట్టు తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు అప్పటి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని కూడా ఆహ్వానించింది. రెండు దేశాల మధ్య సంబంధాలకు క్రికెట్ ఒక వారధిగా మారింది.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ కూడా ఆఫ్ఘాన్ క్రికెటర్లు రాటుదేలేందుకు సహకరించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్తో సహా పలువురు ఆటగాళ్లు ఐపీఎల్లోని పలు టీముల్లో ఆడుతున్నారు. దీంతో వారికి ఇంటర్నేషనల్ ప్లేయర్లతో ఆడే వెసులుబాటు కలగడంతో పాటు క్రికెట్ మెలకువలు తెలుసుకున్నారు.
తాజావార్తలు
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!