Afghanistan: ప్రపంచ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ ఎదుగుదలలో భారత్ కీలక పాత్ర.. ఏం చేసిందంటే..
- టీ-2 వరల్డ్ కప్లో సత్తా చాటుతున్న ఆఫ్ఘనిస్తాన్..
- పసికూన ముద్ర చెరిపేసుకున్న జట్టు..
- క్రికెట్ ప్రపంచంలో నయా సంచనలం..
- ఆఫ్ఘాన్ ఎదుగుదలలో భారత్ కీలక పాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan: ప్రపంచ క్రికెట్లో నిన్నమొన్నటి వరకు పసికూనగా పిలుపుకునే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు సింహంలా గర్జిస్తోంది. హేమాహేమీల లాంటి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి జట్లను మట్టికరిపించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఆకట్టుకుంటోంది. ఆఫ్ఘాన్ ధాటికి ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. టీ 20 వరల్డ్ కప్లో ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ తో పాటు సెమీస్కి దూసుకెళ్లింది.
అయితే, క్రికెట్ ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ ఎదుగుదలలో భారత్ కీలక పాత్ర పోషించింది. బీసీసీఐ ఆఫ్ఘాన్ క్రికెట్ ఎదుగుదలకు తోడ్పాటునందించింది. ఇండియాలోని గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ ఫాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మొదటిసారిగా 2015లో ఆఫ్ఘనిస్తాన్కి ‘‘హోమ్ గ్రౌండ్’’గా మారింది. ఆఫ్ఘనిస్తాన్ తన స్థావరాన్ని షార్జా నుంచి నోయిడాకు మార్చింది. 2017లో గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది.నోయిడా మాత్రమే కాదు డెహ్రాడూర్లో బంగ్లాదేశ్తో జరిగిన టీ-20 సిరస్కి ఆతిథ్యం ఇచ్చింది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Indians In Kenya: “కెన్యాలోని భారతీయులు జాగ్రత్త”.. హింస నేపథ్యంలో కేంద్రం కీలక సూచన..
బీసీసీఐ ఆఫ్ఘాన్కి సౌకర్యాలు కల్పించడమే కాదు, భారత మాజీ క్రికెటర్లు కోచింగ్ కూడా సహకరించింది. లాల్చంద్ రాజ్పుత్, మనోజ్ ప్రభాకర్, అజయ్ జడేజాలు గతంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కోచ్గా పనిచేశారు. వన్డే ప్రపంచకప్-2023 వరకు జడేజా ఆ టీం మెంటర్గా ఉన్నారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రికెట్ బోర్డు అయిన BCCI, రెండు దేశాలు మరియు జట్ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక పెద్ద ముందడుగు వేసి, బెంగళూరులో జట్టు తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు అప్పటి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని కూడా ఆహ్వానించింది. రెండు దేశాల మధ్య సంబంధాలకు క్రికెట్ ఒక వారధిగా మారింది.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ కూడా ఆఫ్ఘాన్ క్రికెటర్లు రాటుదేలేందుకు సహకరించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్తో సహా పలువురు ఆటగాళ్లు ఐపీఎల్లోని పలు టీముల్లో ఆడుతున్నారు. దీంతో వారికి ఇంటర్నేషనల్ ప్లేయర్లతో ఆడే వెసులుబాటు కలగడంతో పాటు క్రికెట్ మెలకువలు తెలుసుకున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
-
Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!