Beating Retreat: భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మనీ
- నేడు అట్టారి- వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ వేడుక..
- గేట్లు తెరవడం, హ్యాండ్షేక్ లేకుండానే బీటింగ్ రీట్రీట్ కార్యక్రమ..
- పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఆగిపోయిన బీటింగ్ రీట్రీట్ వేడుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beating Retreat: భారత్- పాకిస్తాన్ మధ్య గత 10 రోజుల నుంచి కాల్పుల విరమణ అమలులో ఉంది. 10 రోజుల విరామం తర్వాత మళ్లీ బోర్డర్ సెక్యూరిటీ దళాలు బీటింగ్ రీట్రీట్ సెర్మనీ నిర్వహించడానికి రెడీ అయింది. కాగా, పంజాబ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే, పూర్తి స్థాయిలో కాకుండా, స్వల్ప స్థాయిలో ఈ సెర్మనీ చేపట్టానున్నారు. పాకిస్తాన్తో ఉన్న సరిహద్దుల్లో వాఘా-అట్టారి, హుస్సేనివాలా, ఫజిల్కా దగ్గర బీటింగ్ రిట్రీట్ జరగనుంది.
Read Also: IPL 2025: తిక్కకుదిరింది.. గ్రౌండ్ లో గొడవ.. దిగ్వేష్ రాఠి-అభిషేక్ శర్మపై బీసీసీఐ చర్యలు
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
అయితే, బీటీంగ్ రిట్రీట్ సమయంలో పాకిస్తానీ వైపు ఉన్న బోర్డర్ గేట్లు తెరవబోమని భారత అధికారులు చెప్పారు. ఇక పాక్ సిబ్బందితో కరచాలనం చేయడం జరగదని తేల్చి చెప్పారు. కానీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రేక్షకులకు అవకాశం కల్పించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ ప్రోగ్రం జరగబోతుంది. అమృత్సర్కు సమీపంలో ఉన్న వాఘా-అట్టారితో పాటు ఫిరోజ్పుర్లోని హుస్సేనివాలా, ఫజిల్కాలోని సద్కి బోర్డర్ దగ్గర బీటింగ్ రిట్రీట్ ప్రోగ్రాం ఉంటుంది. సాయంత్రం 5.30 నిమిషాలకు భారీ సంఖ్యలో సద్కీ సరిహద్దుకు చేరుకోవాలని స్థానికులకు బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ ఫ్రంట్ పిలుపునిచ్చింది.
Read Also: Pakistan PM: మారని పాక్ పీఎం.. భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..!
కాగా, వాఘా-అట్టారి సరిహద్దు వద్ద 1959 నుంచి బీటింగ్ రిట్రీట్ను కొనసాగిస్తున్నారు. ఆ సమయంలో రెండు దేశాల జాతీయ పతాకాలను అవనతనం చేయనున్నారు. సాధారణంగా బోర్డర్ వద్ద దివాళీ, ఈద్, గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ రోజుల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు స్వీట్లు పంచుకుంటారు. ఇక, అమృత్సర్కు 30 కిలోమీటర్ల దూరంలో, లాహోర్కు 22 కిలోమీటర్ల దూరంలో వాఘా- అట్టారి బోర్డర్ ఉంది. ఇక్కడ బీటీంగ్ రీట్రీట్ కార్యక్రమం వీక్షించడానికి సుమారు 25 వేల మంది సామర్థ్యం కలిగిన గ్యాలరీ ఉంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!