India Pak War: భారత్ పాకిస్తాన్పై విరుచుకుపడుతుంటే, బంగ్లాదేశ్లో భయం మొదలైంది..
- భారత్ పాకిస్తాన్పై తీసుకున్న చర్యలతో బంగ్లాదేశ్లో భయం..
- హిందువుల భద్రతకు కీలక ఆదేశాలు జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pak War: పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలను, వాటి శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 100కు మించి ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం, పాక్ భారత్పై దాడికి పాల్పడింది. దీని తర్వాత మరోసారి ఇండియా తన విశ్వరూపాన్ని చూపించింది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ ఇలా ప్రధాన నగరాలు బాంబు మోతలతో దద్దరిల్లాయి.
అయితే, ఈ పరిణామాలు బంగ్లాదేశ్లో భయాన్ని పుట్టిస్తున్నాయి. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్ని తన పెద్దన్నగా భావిస్తోంది. భారత వ్యతిరేకంగా పాకిస్తాన్కి దగ్గరవుతూ వచ్చింది. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అధికారుల్ని బంగ్లాదేశ్ ఆహ్వానించింది. రెండు దేశాలు వాణిజ్య, ఇతర సంబంధాలను మెరుగుపరుచుకోవాలని భావించాయి.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: Nawaz Sharif: భారత్తో ఉద్రిక్తత.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ కీలక సలహా..
అయితే, ఇప్పుడు భారత్ దెబ్బకు పాకిస్తాన్ వణికిపోతుంది. పాక్ పరిస్థితి ఇలా ఉంటే భారత్తో పెట్టుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో అని బంగ్లాదేశ్ అనుకుందో ఏమో మార్పు కనిపిస్తోంది. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా బంగ్లాదేశ్ని వదిలి భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, బంగ్లా వ్యాప్తంగా హిందువులే టార్గెట్గా ఇళ్లు, ఆస్తులు, ఆలయాలు, వ్యాపారాలను మతోన్మాదులు టార్గెట్ చేశారు. భారత్ ఎన్ని సార్లు చెప్పినా, యూనస్ సర్కార్ అసలు హిందువుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు.
ఇప్పుడు యూనస్ సర్కార్ హిందూ కమ్యూనిటీ భద్రత కోసం స్థానిక పోలీసులు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్-పాక్ ఉద్రిక్తత ప్రభావం బంగ్లాదేశ్ హిందువులపై పడుతుందని యూనస్ సర్కార భయపడుతుంది. ఒకవేళ ఇదే జరిగితే ఇండియా ఊరుకునే పరిస్థితి ఉండదని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏదైనా అల్లర్లను నివారించడానికి బంగ్లాదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయం (PHQ) బుధవారం ఒక లేఖను జారీ చేసింది, మైనారిటీల భద్రతను నిర్ధారించాలని పోలీసు విభాగాలను ఆదేశిస్తోంది. హిందువులకు భారీ భద్రత కల్పించాలని బంగ్లా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
సరిహద్దు ప్రాంతాలు మరియు సోషల్ మీడియాపై నిఘా ఉంచడం హిందువులను లక్ష్యంగా చేసుకుని హింస, అశాంతిని ప్రేరేపించకుండా నిరోధించడానికి సరిహద్దు ప్రాంతాలలో భద్రతను పెంచాలని అధికారులు ఆదేశించారు. మొబైల్ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ కార్యకలాపాలు, సోషల్ మీడియా ఖాతాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!