Bangladesh MP: కోల్కతాలో బంగ్లాదేశ్ ఎంపీ మిస్సింగ్.. హత్యకు గురైనట్లు పోలీసుల అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh MP: బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ ఎంపీ కోల్కతాలో అదృశ్యం కావడం సంచనలంగా మారింది. వైద్యం కోసం మే 12న దేశానికి వచ్చిన బంగ్లా ఎంపీ అన్వరుల్ అజీమ్ అదృశ్యమయ్యారు. చివరిసారిగా మే 14న అతను తన స్నేహితుడి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. దీనిపై భారత్, బంగ్లాదేశ్ అధికారులు విచారణ చేపట్టారు. అన్వరుల్ అజీమ్ ఐదు రోజుల క్రితం చికిత్స కోసం కోల్కతాకు వచ్చిన తర్వాత అదృశ్యమైనట్లు అధికారులు మంగళవారం తెలిపారు. అవామీ లీగ్లో మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.
ఆయన మే 12న కోల్కతాకు చేరుకున్నారు, అప్పటి నుంచి అతను తన కుటుంబాన్ని సంపద్రించలేదు. మే 14 నుంచి ఎంపీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎంపీ కుటుంబం ఈ విషయాన్ని బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో ప్రస్తావించగా.. పీఎం కార్యాలయం ఢిల్లీ, కోల్కతాలోని దౌత్తవేత్తలను అప్రమత్తం చేసింది. వారు పోలీసులతో కలిసి విచారణ ప్రారంభించారు. అన్వరుల్కి కోల్కతా బాగా తెలుసని, అతనికి నగరంలో చాలా మంది పరిచయస్తులు ఉన్నారని తెలిసింది. మే 12న ఎంపీ బారానగర్లోని గోపాల్ బిశ్వాస్ అనే తన స్నేమితుడికి ఇంటికి వెళ్లినట్లు కాన్సులేట్ అధికారి తెలిపారు. మే 14న మళ్లీ తిరిగి వస్తానని చెప్పినప్పటికీ, అతను రాలేదు. దీంతో గోపాల్ బిశ్వాస్ కోల్కతా పోలీసుల వద్ద మిస్సింగ్ కేసు నమోదు చేశాడు.
Also Read
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
Read Also: Swati Maliwal: ‘నా పర్సనల్ ఫోటోలు లీక్ చేయాలని వారిపై ఒత్తిడి’’.. స్వాతి మలివాల్ సంచలనం..
ఎంపీ బంగ్లాదేశ్ కనెక్షన్తో పాటు భారత సిమ్లను కూడా ఉపయోగిస్తున్నారు. రెండు ఫోన్లు ప్రస్తుతం స్విచ్ఛాప్లో ఉన్నాయి. ఎంపీ అన్వరుల్ అజీమ్ కుమార్తె ముంతారిన్ ఫిర్దౌస్ మంగళవారం ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగానికి తన తండ్రి అదృశ్యంపై ఫిర్యాదు చేసింది.సీనియర్ బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ అధికారి మహ్మద్ హరూన్ రషీద్ ప్రకారం.. ఎంపీ ఫోన్ కొన్ని సార్లు స్విచ్ఛాప్, కొన్ని సార్లు పనిచేసినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఎంపీని ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసి మృతదేహాన్ని కోల్కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో న్యూటౌన్లోని ఫ్లాట్లో రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?