Assam: అస్సాంలో బంగ్లాదేశ్ ఉగ్ర మాడ్యుల్ భగ్నం.. 11 మంది అరెస్ట్..
- అస్సాంలో బంగ్లాదేశ్ భారీ ఉగ్ర మాడ్యుల్ భగ్నం..
- 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: అస్సాం పోలీసులు బంగ్లాదేశ్తో సంబంధం ఉన్న అతిపెద్ద ఉగ్ర ముఠాను అరెస్ట్ చేశారు. భారత భద్రతా, నిఘా విభాగం ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా అస్సాంలో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ టెర్రర్ మాడ్యూల్ను అధికారులు భగ్నం చేశారు. మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో నసీమ్ ఉద్దీన్ అలియాస్ నజీముద్దీన్, అలియాస్ తమీమ్(24), జునాబ్ అలీ (38), అఫ్రాహిమ్ హుస్సేన్ (24), మిజానూర్ రెహమాన్ (46), సుల్తాన్ మెహమూద్ (40), మహ్మద్ సిద్ధిక్ అలీ (46), రషీదుల్ ఆలం (28), మహిబుల్ ఖాన్ (25), షారుక్ హుస్సేన్ (22), మహ్మద్ దిల్బర్ రజాక్ (26), జాగీర్ మియా (33) ఉన్నారు.
Read Also: Sadhguru: “కోడి”ని మేపి “ఏనుగు”గా మార్చే సమయం వచ్చింది.. బంగ్లాదేశ్ కామెంట్స్పై సద్గురు..
Also Read
వీరందరికి ఇమామ్ మహమూదర్ కఫిలా (IMK) ఉగ్రవాద ముఠా కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇది బంగ్లాదేశ్కు చెందిన జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB) కు చెందిన ఒక శాఖ,. భారత్తో దీనిని నిషేధించారు. 2018లో ఐఎంకేని జమాత్ మాజీ సభ్యుడు జ్యువెల్ మహమూద్ అలియాస్ ఇమామ్ మహమూద్ హబీబుల్లా స్థాపించాడు. ఇతను ‘‘గజ్వాతుల్ హింద్’’ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాడు.
ఆగస్టు 2024లో షేక్ హసీనా బంగ్లా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉగ్రవాద సంస్థలు పెట్రేగిపోతున్నాయి. ముఖ్యంగా, JMB, అన్సరుల్లా బంగ్లా టీం (ABT) వంటి ఉగ్రవాద సంస్థలు భారత్లో వాటి కార్యకలాపాలను యాక్టివ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. దీని కోసం బంగ్లాకు చెందిన ఉమర్, ఖలీద్ అనే వారిని అస్సాంలో ఉగ్రవాద కార్యకలాపాలను సమన్వయం చేయడానికి నియమించారు. ఉగ్రవాదులు భద్రత కలిగిన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ముఖ్యంగా, అస్సాం, పశ్చిమ బెంగాల్, త్రిపురకు చెందిన యువతను ఉగ్రవాదానికి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!