Bangladesh: షేక్ హసీనా పదవి కోల్పోయేలా చేయడంలో లష్కరే తోయిబా పాత్ర..
- షేక్ హసీనా పదవి కోల్పోయేలా చేయడంలో లష్కరే పాత్ర..
- బహిరంగంగా వెల్లడిస్తున్న జమాత్ ఉద్ దావా టెర్రరిస్టులు..
Bangladesh: లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్ నేతృత్వంలో పనిచేస్తున్న ఉగ్రసంస్థ జమాత్ ఉద్ దావా(జేయూడీ) నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది, బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనాను గద్దె దిగడానికి కారణమైన సామూహిక తిరుగుబాటు, హింసాత్మక ఉద్యమంలో తాము కూడా పాల్గొన్నామని జేయూడీ నాయకులు పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
జేయూడీ నాయకుడు, ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సైఫుల్లా కసూరితో పాటు మరో ఉగ్రవాది ముజమ్మిల్ హష్మీ ఈ వారంలో దీనిపై వ్యాఖ్యానించారు. “1971లో పాకిస్తాన్ ముక్కలైనప్పుడు నాకు నాలుగేళ్లు. అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రెండు దేశాల సిద్ధాంతాన్ని బంగాళాఖాతంలో ముంచానని ప్రకటించారు. మే 10న, మేము 1971 ప్రతీకారం తీర్చుకున్నాము” అని కసూరి పాకిస్తాన్లోని రహీమ్ యార్ ఖాన్లో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ పేర్కొన్నారు. మరోవైపు, ముజమ్మిల్ హష్మీ కూడా ఇదే విధంగా మాట్లాడుతూ.. తాము భారత నాయకత్వాన్ని బంగ్లాదేశ్లో గతేడాది ఓడించామని చెప్పాడు.
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
Read Also: Shashi Tharoor: కాంగ్రెస్ విమర్శలపై స్పందించిన శశిథరూర్.. ఏమన్నారంటే..!
1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు, ఆ తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏర్పడింది. ఏప్రిల్ 22న పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భాగంగా మురిడ్కే (జేయూడి/లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం)పై జరిగిన దాడిలో లష్కరే తోయిబా కమాండర్ ముదస్సర్ చనిపోయినట్లు కసూరి అంగీకరించాడు. అతడి అంత్యక్రియలకు హాజరు కావడానికి నాకు అనుమతి లేదని, ఆ రోజు తాను చాలా ఏడ్చానని చెప్పాడు.
మరోవైపు, ముదస్సర్ అంత్యక్రియలకు పాక్ పంజాబ్ ప్రావిన్సు లోని సైనిక ఉన్నతాధికారులు, పోలీసులు, అధికారులు హాజరయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడికి తను సూత్రధారిగా చెప్పి, ప్రపంచంలోనే ఫేమస్ చేశారని కసూరి అన్నాడు. మేము తదుపరి తరాన్ని జిహాద్ కోసం సిద్ధం చేస్తున్నామని, మేము చనిపోవడానికి భయపడమని బహిరంగంగా చెబుతున్నాడు.
తాజావార్తలు
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!