Bangladesh: ‘‘ఘజ్వా-ఎ-హింద్’’.. భారత్పై యుద్ధానికి 50 లక్షల మంది బంగ్లాదేశ్ యువత సిద్ధం..
- భారత్ పై ‘‘ఘజ్వా ఎ హింద్’’ చేపడుతాం..
- యుద్ధానికి సిద్దంగా 50 లక్షల మంది బంగ్లాదేశ్ యువత..
- జమాతే ఇస్లామీ నేత రెచ్చగొట్టే ప్రకటనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడం, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ అధికారంలోకి రావడంతో అక్కడి మతోన్మాదులు చెలరేగిపోతున్నారు. భారత్ టార్గెట్గా విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, బంగ్లాదేశ్ జమాతే ఇస్తామీ డిప్యూటీ లీడర్ అమీర్ సయ్యద్ అబ్దుల్లా మహ్మద్ తాహెర్ ‘‘ఘజ్వా-ఎ-హింద్’’ గురించి మాట్లాడుతూ, భారత్ను బెదిరించే ప్రయత్నం చేశారు. భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చేందుకు మతోన్మాదులు తరుచూ ‘‘ఘజ్వా-ఏ-హిందూ’’ చేపడుతామని ప్రగల్భాలు పలుకుతుంటారు.
Read Also: Karur Stampede : గుండె వణికిపోయింది.. తొక్కిసలాటపై రజినీకాంత్, కమల్ హాసన్ రియాక్ట్
Also Read
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, బంగ్లాదేశ్పై సైనిక చర్యకు ప్రయత్నిస్తే తాము యుద్ధం చేస్తామని తాహెర్ అన్నాడు. బంగ్లాదేశ్ అమెరికన్ అసోసియేషన్ న్యూయార్క్లో నిర్వహించిన ప్రజా స్వాగత సభలో ప్రసంగిస్తూ.. జమాతే ఇస్లామి ‘‘ఘజ్వా ఎ హింద్ ’’ కు సిద్దంగా ఉందని పేర్కొన్నాడు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో జమాతే ఇస్లామీ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది. అయితే, ఆ కళంకాన్ని తుడిచేయడానికి భారత్పై యుద్ధంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్లో 50 లక్షల మంది యువత సిద్ధంగా ఉన్నారు అని జమాత్ నేత చెప్పాడు.
“జమాత్ అధికారంలోకి వస్తే భారతదేశం బంగ్లాదేశ్పై దాడి చేయగలదని ప్రజలు నమ్ముతారు. వారు ప్రవేశించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇది 1971లో మనపై ఉన్న కళంకాన్ని తొలగిస్తుంది మరియు నిజమైన స్వాతంత్ర్య సమరయోధులుగా నిరూపించుకోవడానికి మాకు అవకాశం ఇస్తుంది’’ అని అన్నాడు. బంగ్లాదేశ్పై భారత్ దాడి చేస్తే షేక్ హసీనా మద్దతు ఇస్తుందని ఆరోపించాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!