Bangladesh: షేక్ హసీనాపై యూకే వేదికగా పాక్, చైనా కుట్ర.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్..
- యూకే వేదికగా షేక్ హసీనాను దించే కుట్ర..
- పాకిస్తాన్ ఐఎస్ఐ-చైనా ప్లాన్..
- ఐఎస్ఐతో ఖలిదా జియా కుమారుడి భేటీ..
- ఆజ్యం పోసిన రిజర్వేషన్ కోటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: యూకే లండన్ వేదికగా షేక్ హసీనాను బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి దించేందుకు కుట్ర రూపొందిచబడినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నారు. ఇందుకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా విషయం కారణమైంది. బంగ్లాదేశ్లో పాలన మార్పుపై యూకేలో బ్లూ ప్రింట్ రూపొందించబడింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్, మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు తారిక్ రెహమ్మాన్ సౌదీ అరేబియాలోని పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ అధికారులతో సమావేశమైనట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు బంగ్లాదేశ్ అధికారులు పేర్కొన్నారు.
హింసకు ముందు ఎక్స్ వేదికగా అనేక ‘‘ బంగ్లాదేశ్ వ్యతిరేక’’ హ్యాండిల్స్ నిరంతరం నిరసనలకు ఆజ్యం పోశాయి. పాకిస్తాన్ హ్యాండిల్స్ నుంచి షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 500 పైగా వ్యతిరేక ట్వీట్లు చేయబడ్డాయి. హసీనా ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, పాకిస్తాన్ అనుకూలమైన బీఎన్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెలిపాయి. ఐఎస్ఐ ద్వారా చైనా కూడా నిరసనల్ని పెంచేందుకు సహకరించి, షేక్ హసీనా భారత్ పారిపోయేలా చేసింది.
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
Read Also: Indian Hockey Team: 44 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించబోతుందా..?
చైనా, ఐఎస్ఐ ఎలా కుట్ర పన్నాయి..?
ప్రభుత్వం ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ విమోచన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై అక్కడి విద్యార్థులు ఉద్యమం చేశారు. ఆ తర్వాత ఇవి హింసాత్మక ఘటనలుగా మారడంతో 300 మంది మరణించారు. జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన విద్యార్థి విభాగమైన ఇస్లామీ ఛత్రత శిబిర్(ఐసీఎస్)కి పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉంది. హసీనా స్థానంలో పాక్-చైనా అనుకూల పాలన తీసుకువచ్చేందుకు కుట్ర పన్నినట్లు నిఘా సంస్థలు తెలిపాయి. భారత వ్యతిరేక వైఖరితో ‘ఇండియా అవుట్’ అనే నిరసనను జమాతే ఇస్లామీ సంస్థ ప్లా్న్ చేసింది.
మొత్తం నిరసనలకు, హింసకు పాకిస్తాన్లో పనిచేస్తున్న చైనా సంస్థల నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ నిరసనల సమయంలో సోషల్ మీడియా కార్యకలాపాలను స్కాన్ చేస్తున్నప్పుడు, అవామీ లీగ్కు వ్యతిరేకంగా పోస్ట్లు, నిరసనకారులపై హింసాత్మక వీడియోలు మరియు షేక్ హసీనాను రాక్షసంగా చిత్రీకరించే పోస్టర్లు BNP మరియు దాని అనుబంధ ఖాతాలచే తయారు చేయబడుతున్నట్లు గమనించబడింది. వీటిలో చాలా వరకు యూఎస్-ఆధారిత అకౌంట్ల ద్వారా విస్తరించబడింది.
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!