Bangladesh: షేక్ హసీనాపై యూకే వేదికగా పాక్, చైనా కుట్ర.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్..
- యూకే వేదికగా షేక్ హసీనాను దించే కుట్ర..
- పాకిస్తాన్ ఐఎస్ఐ-చైనా ప్లాన్..
- ఐఎస్ఐతో ఖలిదా జియా కుమారుడి భేటీ..
- ఆజ్యం పోసిన రిజర్వేషన్ కోటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: యూకే లండన్ వేదికగా షేక్ హసీనాను బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి దించేందుకు కుట్ర రూపొందిచబడినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నారు. ఇందుకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా విషయం కారణమైంది. బంగ్లాదేశ్లో పాలన మార్పుపై యూకేలో బ్లూ ప్రింట్ రూపొందించబడింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్, మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు తారిక్ రెహమ్మాన్ సౌదీ అరేబియాలోని పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ అధికారులతో సమావేశమైనట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు బంగ్లాదేశ్ అధికారులు పేర్కొన్నారు.
హింసకు ముందు ఎక్స్ వేదికగా అనేక ‘‘ బంగ్లాదేశ్ వ్యతిరేక’’ హ్యాండిల్స్ నిరంతరం నిరసనలకు ఆజ్యం పోశాయి. పాకిస్తాన్ హ్యాండిల్స్ నుంచి షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 500 పైగా వ్యతిరేక ట్వీట్లు చేయబడ్డాయి. హసీనా ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, పాకిస్తాన్ అనుకూలమైన బీఎన్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెలిపాయి. ఐఎస్ఐ ద్వారా చైనా కూడా నిరసనల్ని పెంచేందుకు సహకరించి, షేక్ హసీనా భారత్ పారిపోయేలా చేసింది.
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
Read Also: Indian Hockey Team: 44 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించబోతుందా..?
చైనా, ఐఎస్ఐ ఎలా కుట్ర పన్నాయి..?
ప్రభుత్వం ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ విమోచన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై అక్కడి విద్యార్థులు ఉద్యమం చేశారు. ఆ తర్వాత ఇవి హింసాత్మక ఘటనలుగా మారడంతో 300 మంది మరణించారు. జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన విద్యార్థి విభాగమైన ఇస్లామీ ఛత్రత శిబిర్(ఐసీఎస్)కి పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉంది. హసీనా స్థానంలో పాక్-చైనా అనుకూల పాలన తీసుకువచ్చేందుకు కుట్ర పన్నినట్లు నిఘా సంస్థలు తెలిపాయి. భారత వ్యతిరేక వైఖరితో ‘ఇండియా అవుట్’ అనే నిరసనను జమాతే ఇస్లామీ సంస్థ ప్లా్న్ చేసింది.
మొత్తం నిరసనలకు, హింసకు పాకిస్తాన్లో పనిచేస్తున్న చైనా సంస్థల నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ నిరసనల సమయంలో సోషల్ మీడియా కార్యకలాపాలను స్కాన్ చేస్తున్నప్పుడు, అవామీ లీగ్కు వ్యతిరేకంగా పోస్ట్లు, నిరసనకారులపై హింసాత్మక వీడియోలు మరియు షేక్ హసీనాను రాక్షసంగా చిత్రీకరించే పోస్టర్లు BNP మరియు దాని అనుబంధ ఖాతాలచే తయారు చేయబడుతున్నట్లు గమనించబడింది. వీటిలో చాలా వరకు యూఎస్-ఆధారిత అకౌంట్ల ద్వారా విస్తరించబడింది.
తాజావార్తలు
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!