Badruddin Ajmal: బీజేపీని ఓడించేందుకు త్యాగానికి సిద్ధం.. విపక్షాల ఐక్యతకు మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Badruddin Ajmal: కర్ణాటకలో బీజేపీ పరాజయంతో 2024 ఎన్నికల్లో విపక్షాల కూటమి అనేది చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీని ఓడించాలంటే విపక్షాల ఐక్యత ముఖ్యమని భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే అస్సాంకు చెందిన వివాదాస్పద నేత, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్, విపక్ష కూటమి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడేందుకు విపక్ష కూటమిలో చేరాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.
Read Also: Adah Sharma: ది కేరళ స్టొరీ హీరోయిన్ కి యాక్సిడెంట్…
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
అజ్మల్ నేతృత్వంలోని ఏఐయూడీఎఫ్ ప్రతినిధి బృందం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను కలిసింది. మొదటి నుంచి మేము కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో ఉననామని, ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి మా పార్టీ ప్రతిపక్ష ఐక్యతకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం తెలిపారు. దేశంలోని అన్ని ప్రతిపక్షాలు ఒకే వేదికపైకి రావాలని, బీజేపీని గద్దె దించాలంటే ఇదే మార్గమని ఆయన అన్నారు. ప్రతిపక్షాల కూటమిలో కాంగ్రెస్ పాలు పంచుకోవాలని సూచించారు.
బీజేపీని ఓడించేందుకు తమ పార్టీ త్యానికైనా సిద్ధమని అమీనుల్ ఇస్లాం అన్నారు. అస్సాంలో తమ పార్టీకి 16 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారని, అంతకుముందు అస్సాంలో మూడు పార్లమెంటరీ స్థానాల్లో గెలిచామని, ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో మూడో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్నామని, బీజేపీని నిర్మూలించేందుకు మా పార్టీ త్యాగాలను చేస్తుందని అమీనుల్ ఇస్లాం అన్నారు. ప్రస్తుతం ఏఐయూడీఎఫ్ కు, కాంగ్రెస్ తో పెద్దగా సంబంధాలు లేవు. అయితే తమ పార్టీ కాంగ్రెస్ తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!