Ayodhya: అయోధ్య రాముడి కోసం బంగారు ధనుస్సు సిద్ధం
- ఒడిస్సా భక్తుల బహుమతిగా స్వర్ణ రామధనుస్సు
- 286 కిలోల బరువుతో రూపుదిద్దుకున్న అద్భుత కళాఖండం
- పూరీ నుంచి అయోధ్యకు శోభాయాత్రగా ప్రయాణం
- ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవానికి ప్రత్యేక కానుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya: అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముడికి ఒడిస్సా భక్తులు అత్యంత అరుదైన, అద్భుతమైన కానుకను సిద్ధం చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, 286 కిలోల బరువున్న భారీ ‘స్వర్ణ ధనుస్సు’ను అయోధ్యకు పంపించనున్నారు. ఒడిస్సాలోని రూర్కెలాలో ఈ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. దాదాపు 286 కిలోల బరువు ఉన్న ఈ ధనుస్సును తయారు చేయడానికి అత్యంత ఖరీదైన లోహాలను ఉపయోగించారు. ఇందులో ఒక కిలో బంగారం, రెండున్నర కిలోల వెండితో పాటు రాగి, జింక్, , ఇనుము వంటి లోహాల మిశ్రమాన్ని వాడారు. ఈ ధనుస్సు తయారీకి సుమారు కోటి 10 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.
ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది 2’ గ్యాంగ్లో ఊహించని ట్విస్ట్.. ఆ కీలక నటుడు అవుట్?
Also Read
- Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసు.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి
- Meghalaya Honeymoon Murder Case: 'నేను అమాయకురాలిని, నన్ను ఇరికించారు'.. సోనమ్ సంచలన వ్యాఖ్యలు..
- Shresta Iyer: శ్రేయస్ అయ్యర్ సోదరికి అత్యాచార బెదిరింపులు.. శ్రేష్ఠ అయ్యర్ ఆవేదన
- FSSAI Liquor Notices: బీర్, విస్కీ, రమ్, తాగుతున్నారా?.. ఇది మీకోసమే..!
ఈ రామధనుస్సు సుమారు 8 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ఎంతో గంభీరంగా చూడముచ్చటగా ఉంది. పూరీ జగన్నాథ స్వామి , అయోధ్య రాముడి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధానికి ప్రతీకగా, ఈ ధనుస్సుపై జగన్నాథుడి ప్రతిమను , ఫిలిగ్రీ కిరీటాన్ని అత్యంత నైపుణ్యంతో చెక్కారు. ఇది కేవలం ఒక ఆయుధంలా కాకుండా, ఒడిస్సా ప్రజల భక్తికి చిహ్నంగా నిలుస్తోంది.
సనాతన జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ ధనుస్సును ఒడిస్సాలోని వివిధ జిల్లాల గుండా ప్రయాణింపజేశారు. ఈ క్రమంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ధనుస్సును దర్శించుకున్నారు. తొలుత పూరీ క్షేత్రానికి చేరుకున్న ఈ ధనుస్సుకు అక్కడ పవిత్ర క్రతువులు నిర్వహించారు. పూరీలో పూజల అనంతరం, ఈ స్వర్ణ ధనుస్సు శోభాయాత్రగా అయోధ్యకు బయలుదేరింది.
జనవరి 22న అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా (వార్షికోత్సవం), ఈ స్వర్ణ ధనుస్సును బాలరాముడి పాదాల చెంత భక్తిపూర్వకంగా సమర్పించనున్నారు. హిందువుల 500 ఏళ్ల కల నెరవేరిన వేళ, అయోధ్య మందిర నిర్మాణ పనులు కూడా పూర్తి కావడంతో ఈ కానుక మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భారీ స్వర్ణ ధనుస్సు అయోధ్యకు చేరుకున్న తర్వాత, భక్తులకు మరో అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.
Vasant Panchami 2026 : చదువుల తల్లిని పూజించే వేళ.. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.!
తాజావార్తలు
-
Ring Removal Tips: మీ ఉంగరం వేలికి ఇరుక్కుపోయిందా..? సింపుల్గా తీసే చిట్కాలు ఇవే..
-
Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. ‘భాగమతి’ డైరెక్టర్పై కేసు నమోదు!
-
Timex Deepwater Meridian 300: టైమెక్స్ డీప్వాటర్ మెరిడియన్ 300 వాచ్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!