Ayodhya: అయోధ్య రాముడి కోసం బంగారు ధనుస్సు సిద్ధం
- ఒడిస్సా భక్తుల బహుమతిగా స్వర్ణ రామధనుస్సు
- 286 కిలోల బరువుతో రూపుదిద్దుకున్న అద్భుత కళాఖండం
- పూరీ నుంచి అయోధ్యకు శోభాయాత్రగా ప్రయాణం
- ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవానికి ప్రత్యేక కానుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya: అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముడికి ఒడిస్సా భక్తులు అత్యంత అరుదైన, అద్భుతమైన కానుకను సిద్ధం చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, 286 కిలోల బరువున్న భారీ ‘స్వర్ణ ధనుస్సు’ను అయోధ్యకు పంపించనున్నారు. ఒడిస్సాలోని రూర్కెలాలో ఈ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. దాదాపు 286 కిలోల బరువు ఉన్న ఈ ధనుస్సును తయారు చేయడానికి అత్యంత ఖరీదైన లోహాలను ఉపయోగించారు. ఇందులో ఒక కిలో బంగారం, రెండున్నర కిలోల వెండితో పాటు రాగి, జింక్, , ఇనుము వంటి లోహాల మిశ్రమాన్ని వాడారు. ఈ ధనుస్సు తయారీకి సుమారు కోటి 10 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.
ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది 2’ గ్యాంగ్లో ఊహించని ట్విస్ట్.. ఆ కీలక నటుడు అవుట్?
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ఈ రామధనుస్సు సుమారు 8 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ఎంతో గంభీరంగా చూడముచ్చటగా ఉంది. పూరీ జగన్నాథ స్వామి , అయోధ్య రాముడి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధానికి ప్రతీకగా, ఈ ధనుస్సుపై జగన్నాథుడి ప్రతిమను , ఫిలిగ్రీ కిరీటాన్ని అత్యంత నైపుణ్యంతో చెక్కారు. ఇది కేవలం ఒక ఆయుధంలా కాకుండా, ఒడిస్సా ప్రజల భక్తికి చిహ్నంగా నిలుస్తోంది.
సనాతన జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ ధనుస్సును ఒడిస్సాలోని వివిధ జిల్లాల గుండా ప్రయాణింపజేశారు. ఈ క్రమంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ధనుస్సును దర్శించుకున్నారు. తొలుత పూరీ క్షేత్రానికి చేరుకున్న ఈ ధనుస్సుకు అక్కడ పవిత్ర క్రతువులు నిర్వహించారు. పూరీలో పూజల అనంతరం, ఈ స్వర్ణ ధనుస్సు శోభాయాత్రగా అయోధ్యకు బయలుదేరింది.
జనవరి 22న అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా (వార్షికోత్సవం), ఈ స్వర్ణ ధనుస్సును బాలరాముడి పాదాల చెంత భక్తిపూర్వకంగా సమర్పించనున్నారు. హిందువుల 500 ఏళ్ల కల నెరవేరిన వేళ, అయోధ్య మందిర నిర్మాణ పనులు కూడా పూర్తి కావడంతో ఈ కానుక మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భారీ స్వర్ణ ధనుస్సు అయోధ్యకు చేరుకున్న తర్వాత, భక్తులకు మరో అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.
Vasant Panchami 2026 : చదువుల తల్లిని పూజించే వేళ.. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.!
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!