Ayodhya: అయోధ్య రాముడి కోసం బంగారు ధనుస్సు సిద్ధం
- ఒడిస్సా భక్తుల బహుమతిగా స్వర్ణ రామధనుస్సు
- 286 కిలోల బరువుతో రూపుదిద్దుకున్న అద్భుత కళాఖండం
- పూరీ నుంచి అయోధ్యకు శోభాయాత్రగా ప్రయాణం
- ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవానికి ప్రత్యేక కానుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya: అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముడికి ఒడిస్సా భక్తులు అత్యంత అరుదైన, అద్భుతమైన కానుకను సిద్ధం చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, 286 కిలోల బరువున్న భారీ ‘స్వర్ణ ధనుస్సు’ను అయోధ్యకు పంపించనున్నారు. ఒడిస్సాలోని రూర్కెలాలో ఈ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. దాదాపు 286 కిలోల బరువు ఉన్న ఈ ధనుస్సును తయారు చేయడానికి అత్యంత ఖరీదైన లోహాలను ఉపయోగించారు. ఇందులో ఒక కిలో బంగారం, రెండున్నర కిలోల వెండితో పాటు రాగి, జింక్, , ఇనుము వంటి లోహాల మిశ్రమాన్ని వాడారు. ఈ ధనుస్సు తయారీకి సుమారు కోటి 10 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.
ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది 2’ గ్యాంగ్లో ఊహించని ట్విస్ట్.. ఆ కీలక నటుడు అవుట్?
Also Read
- VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
ఈ రామధనుస్సు సుమారు 8 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ఎంతో గంభీరంగా చూడముచ్చటగా ఉంది. పూరీ జగన్నాథ స్వామి , అయోధ్య రాముడి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధానికి ప్రతీకగా, ఈ ధనుస్సుపై జగన్నాథుడి ప్రతిమను , ఫిలిగ్రీ కిరీటాన్ని అత్యంత నైపుణ్యంతో చెక్కారు. ఇది కేవలం ఒక ఆయుధంలా కాకుండా, ఒడిస్సా ప్రజల భక్తికి చిహ్నంగా నిలుస్తోంది.
సనాతన జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ ధనుస్సును ఒడిస్సాలోని వివిధ జిల్లాల గుండా ప్రయాణింపజేశారు. ఈ క్రమంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ధనుస్సును దర్శించుకున్నారు. తొలుత పూరీ క్షేత్రానికి చేరుకున్న ఈ ధనుస్సుకు అక్కడ పవిత్ర క్రతువులు నిర్వహించారు. పూరీలో పూజల అనంతరం, ఈ స్వర్ణ ధనుస్సు శోభాయాత్రగా అయోధ్యకు బయలుదేరింది.
జనవరి 22న అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా (వార్షికోత్సవం), ఈ స్వర్ణ ధనుస్సును బాలరాముడి పాదాల చెంత భక్తిపూర్వకంగా సమర్పించనున్నారు. హిందువుల 500 ఏళ్ల కల నెరవేరిన వేళ, అయోధ్య మందిర నిర్మాణ పనులు కూడా పూర్తి కావడంతో ఈ కానుక మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భారీ స్వర్ణ ధనుస్సు అయోధ్యకు చేరుకున్న తర్వాత, భక్తులకు మరో అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.
Vasant Panchami 2026 : చదువుల తల్లిని పూజించే వేళ.. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.!
తాజావార్తలు
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!