National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు చేసుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) షాక్ ఇచ్చింది. వీరిద్దరికి సంబంధించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ఏప్రిల్ 11న, ఈడీ ఢిల్లీ, ముంబై, లక్నోలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్లకు ఈడీ నోటీసులు జారీ చేుసింది. అసోసియేట్ జర్నల్ లిమిటెడ్కి చెందిన ఈ ఆస్తుల్ని రాహుల్, సోనియా గాంధీ యాజమాన్యంలోని యంగ్ ఇండియన్ కంపెనీ ద్వారా కొనుగోలు చేయబడ్డాయి.
నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను పబ్లిష్ చేసిన అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ని యంగ్ ఇండియన్ లిమిటెడ్ కొనుగోలు చేయడంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, నిధుల దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలకు సంబంధించింది ఈ కేసు. బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి.. రూ. 2000 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని నియంత్రించడానికి యంగ్ ఇండియన్ లిమిటెడ్, అసోసియేట్ జర్నల్ ఆస్తుల్ని దుర్మార్గపు పద్ధతిలో స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
Read Also: UK YouTuber: బ్రిటీష్.. భారత్ను చూసి నేర్చుకోవాలి.. యూకే యూట్యూబర్ ఎందుకు ఇలా అన్నాడు?
కాంగ్రెస్ నియంత్రణలో ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)పై జరిగిన మనీలాండరింగ్ కేసులో దర్యాప్తులో జప్తు చేసిన రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తుల స్వాధీనం కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఐటీఓలోని హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఆస్తిని, లక్నోలోని బిశేశ్వర్ నాథ్ రోడ్లోని ఏజేఎల్ భవనాన్ని ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు అందించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)లోని సెక్షన్ (8),రూల్ 5(1) కింద ఈ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నారు.
ఈడీ ప్రకారం, అటాచ్ చేయబడిన AJL ఆస్తులు, రూ. 988 కోట్లు నేరంలో మనీలాండరింగ్ చేసినట్లు దర్యాప్తు వెల్లడించింది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్లో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు మెజారిటీ వాటాలు ఉన్నాయి. వీరికి ఒక్కొక్కరికి 38 శాతం వాటాల ఉన్నాయి.