National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో ఆస్తులు స్వాధీనం.. రాహుల్, సోనియా గాంధీలకు ఈడీ షాక్..
- నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ షాక్..
- కీలక ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్న ఈడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు చేసుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) షాక్ ఇచ్చింది. వీరిద్దరికి సంబంధించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ఏప్రిల్ 11న, ఈడీ ఢిల్లీ, ముంబై, లక్నోలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్లకు ఈడీ నోటీసులు జారీ చేుసింది. అసోసియేట్ జర్నల్ లిమిటెడ్కి చెందిన ఈ ఆస్తుల్ని రాహుల్, సోనియా గాంధీ యాజమాన్యంలోని యంగ్ ఇండియన్ కంపెనీ ద్వారా కొనుగోలు చేయబడ్డాయి.
నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను పబ్లిష్ చేసిన అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ని యంగ్ ఇండియన్ లిమిటెడ్ కొనుగోలు చేయడంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, నిధుల దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలకు సంబంధించింది ఈ కేసు. బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి.. రూ. 2000 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని నియంత్రించడానికి యంగ్ ఇండియన్ లిమిటెడ్, అసోసియేట్ జర్నల్ ఆస్తుల్ని దుర్మార్గపు పద్ధతిలో స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
Also Read
Read Also: UK YouTuber: బ్రిటీష్.. భారత్ను చూసి నేర్చుకోవాలి.. యూకే యూట్యూబర్ ఎందుకు ఇలా అన్నాడు?
కాంగ్రెస్ నియంత్రణలో ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)పై జరిగిన మనీలాండరింగ్ కేసులో దర్యాప్తులో జప్తు చేసిన రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తుల స్వాధీనం కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఐటీఓలోని హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఆస్తిని, లక్నోలోని బిశేశ్వర్ నాథ్ రోడ్లోని ఏజేఎల్ భవనాన్ని ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు అందించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)లోని సెక్షన్ (8),రూల్ 5(1) కింద ఈ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నారు.
ఈడీ ప్రకారం, అటాచ్ చేయబడిన AJL ఆస్తులు, రూ. 988 కోట్లు నేరంలో మనీలాండరింగ్ చేసినట్లు దర్యాప్తు వెల్లడించింది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్లో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు మెజారిటీ వాటాలు ఉన్నాయి. వీరికి ఒక్కొక్కరికి 38 శాతం వాటాల ఉన్నాయి.
తాజావార్తలు
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!