Assam: బంగ్లా చొరబాట్లు, స్థానికులకు తుపాకులు ఇవ్వనున్న అస్సాం ప్రభుత్వం..
- స్థానిక ప్రజలకు ఆయుధాలు ఇవ్వనున్న అస్సాం ప్రభుత్వం..
- చొరబాట్లు, ఆక్రమదారుల్ని అడ్డుకోవడంపై హిమంత సర్కార్ దృష్టి..
- బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి విచ్చలవిడిగా చొరబాట్లు..
- ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్న కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: అస్సాంలో స్థానిక ప్రజలు, భారతీయులకు ఆయుధాలు ఇచ్చేందుకు అక్కడి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయుధ లైసెన్సులు మంజూరు చేసేందుకు ఒక పోర్టల్ ప్రారంభించాలని యోచిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఈ పోర్టల్ ప్రారంభించబడుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం తెలిపారు. ఆక్రమిత అటవీ, చిత్తడి నేలల నుంచి అక్రమ స్థిర నివాసులు, ఆక్రమణదారులు, ఎక్కువగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను తరిమికొట్టడానికి రాష్ట్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది.
‘‘ఆయుధ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఒక పోర్టల్ ఉంటుంది. ఆగస్టు 1-7 మధ్య ప్రారంభం అవుతుంది. డిప్యూటీ కమిషనర్ విచారణ నిర్వహిస్తారు. ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వారికి ఆయుధ లైసెన్స్ మంజూరు అవుతుంది’’ అని హిమంత ఎక్స్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. పోర్టల్ ప్రారంభించిన తర్వాత ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరని, పోర్టల్ లేకపోయినా ఫిజికల్గా పత్రాలను సమర్పించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఎలాంటి పరిమితులు లేవని వెల్లడించారు.
Also Read
Read Also: Gandikota Murder Case: గండికోట మైనర్ బాలిక హత్య కేసు.. కీలక ఆధారాలు లభ్యం..!
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల ఆక్రమణపై జూలై 21న హిమంత మాట్లాడుతూ.. జనాభాలో మార్పులను నియంత్రించకపోతే స్థానిక అస్సామీలు, హిందువులు 10 ఏళ్లలో రాష్ట్రంలో మైనారిటీలుగా మారుతారని ఆయన చెప్పారు. అక్రమ వలసదారుల నుంచి భూమిని విడిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇప్పటికే 18 లక్షల ఎకరాల భూమి ఆక్రమణదారుల కింద ఉందని చెప్పారు.
అయితే, సరిహద్దు, మారుమూల ప్రాంతాల్లో నివసించే స్థానిక భారత ప్రజలకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్నయాన్ని అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ గౌరవ్ గొగోయ్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై మే నెలలో నిర్ణయం తీసుకుంది. అస్సాం ప్రజలకు తుపాకులు కాదని, నీరు, ఉపాధి, విద్య, వైద్య సౌకర్యాలను కోరుకుంటున్నారని ఆయన మే నెలలో అన్నారు. రాష్ట్రంలోని ధుబ్రి, నాగావ్, మోరిగావ్, బార్పెట,ర సౌత్ సల్మారా, గోల్పారా జిల్లాల్లోని ప్రజలకు ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!