Himanta Biswa Sarma: హిందూ అమ్మాయిలు ఎమోషనల్.. “లవ్ జీహాద్”పై కఠిన చట్టం అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam CM Himanta Biswa Sarma’s key comments on Shraddha’s case: ఢిల్లీ శ్రద్దా వాకర్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా గొంతుకోసి చంపేశాడు. మే నెలలో జరిగిన ఈ దారుణహత్య, శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో గత వారం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి, 18 రోజుల పాటు రోజూరాత్రి ఢిల్లీ సమీపంలోని ఛత్తార్ పూర్ అటవీ ప్రాంతంలో పారేసినట్లు నిందితుడు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు.
ఇదిలా ఉంటే ఈ హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీకి చెందిన పలువురు నేతలు శ్రద్ధా మరణాన్ని ‘‘లవ్ జీహాద్’’గా అభివర్ణిస్తున్నారు. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, శ్రద్ధా హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. శ్రద్ధావాకర్ మరణాన్ని ‘లవ్ జీహాద్’ అని అన్నారు. అఫ్తాబ్, శ్రద్ధాను చంపి 35 ముక్కులుగా నరికాడని.. శ్రద్ధాను పెళ్లి పేరుతో ముంబై నుంచి ఢిల్లీ తీసుకెళ్లాడని.. పెళ్లి చేసుకోలేదని, అయితే శరీరాన్ని ముక్కలుగా చేసి శరీరాన్ని ఫ్రిజ్ లో పెట్టాడని అన్నారు.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: Madras Eye: తమిళనాడును కలవరపెడుతున్న “మద్రాస్ ఐ” .. ప్రతిరోజూ 4 వేలకు పైగా కేసులు
అయితే హిందూ అమ్మాయినే ఎందుకు తీసుకువచ్చావని పోలీసులు అడిగితే.. వారు ఎమెషనల్ కాబట్టే ఇలా చేశానని అఫ్తాబ్ చెప్పాడని హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇది ఒక్క కేసే కానది.. ఇలాంటి అఫ్తాబ్-శ్రద్ధాలు దేశవ్యాప్తంగా ఉన్నారని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకూడదంటే.. ‘లవ్ జీహాద్’పై కఠిన చట్టాలు తీసుకురావాలని, ఇది కేవలం బీజేపీతోనే సాధ్యం అవుతుందని ఆయన అన్నారు.
శ్రద్ధా హత్య కేసులో ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. శ్రద్ధాకు సంబంధించిన ఎముకలు, అఫ్తాబ్ ప్లాట్ లో రక్తపు ఆనవాళ్లను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబుకు డీఎన్ఏ పరీక్ష కోసం పంపారు. నిందితుడు అఫ్తాబ్ కు నార్కో పరీక్షలకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. మరో కొన్ని రోజుల్లో డీఎన్ఏ ఫలితాలు రానున్నాయి. ఈ డీఏఎన్ఏ శ్రద్ధా తండ్రితో సరిపోలితే.. కేసు మరింత బలపడే అవకాశం ఉంది.
#WATCH | Gujarat: Aftaab killed Shardha & chopped her body into 35 pieces. When police asked why he brought only Hindu girls he said he did it because they're emotional.There're other Aftaab-Shradha too,country needs strict law against 'Love Jihaad': Assam CM HB Sarma in Dhansura pic.twitter.com/5PEc7HsvVh
— ANI (@ANI) November 22, 2022
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!