Himanta Biswa Sarma: హిందూ అమ్మాయిలు ఎమోషనల్.. “లవ్ జీహాద్”పై కఠిన చట్టం అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam CM Himanta Biswa Sarma’s key comments on Shraddha’s case: ఢిల్లీ శ్రద్దా వాకర్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా గొంతుకోసి చంపేశాడు. మే నెలలో జరిగిన ఈ దారుణహత్య, శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో గత వారం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి, 18 రోజుల పాటు రోజూరాత్రి ఢిల్లీ సమీపంలోని ఛత్తార్ పూర్ అటవీ ప్రాంతంలో పారేసినట్లు నిందితుడు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు.
ఇదిలా ఉంటే ఈ హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీకి చెందిన పలువురు నేతలు శ్రద్ధా మరణాన్ని ‘‘లవ్ జీహాద్’’గా అభివర్ణిస్తున్నారు. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, శ్రద్ధా హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. శ్రద్ధావాకర్ మరణాన్ని ‘లవ్ జీహాద్’ అని అన్నారు. అఫ్తాబ్, శ్రద్ధాను చంపి 35 ముక్కులుగా నరికాడని.. శ్రద్ధాను పెళ్లి పేరుతో ముంబై నుంచి ఢిల్లీ తీసుకెళ్లాడని.. పెళ్లి చేసుకోలేదని, అయితే శరీరాన్ని ముక్కలుగా చేసి శరీరాన్ని ఫ్రిజ్ లో పెట్టాడని అన్నారు.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
Read Also: Madras Eye: తమిళనాడును కలవరపెడుతున్న “మద్రాస్ ఐ” .. ప్రతిరోజూ 4 వేలకు పైగా కేసులు
అయితే హిందూ అమ్మాయినే ఎందుకు తీసుకువచ్చావని పోలీసులు అడిగితే.. వారు ఎమెషనల్ కాబట్టే ఇలా చేశానని అఫ్తాబ్ చెప్పాడని హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇది ఒక్క కేసే కానది.. ఇలాంటి అఫ్తాబ్-శ్రద్ధాలు దేశవ్యాప్తంగా ఉన్నారని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకూడదంటే.. ‘లవ్ జీహాద్’పై కఠిన చట్టాలు తీసుకురావాలని, ఇది కేవలం బీజేపీతోనే సాధ్యం అవుతుందని ఆయన అన్నారు.
శ్రద్ధా హత్య కేసులో ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. శ్రద్ధాకు సంబంధించిన ఎముకలు, అఫ్తాబ్ ప్లాట్ లో రక్తపు ఆనవాళ్లను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబుకు డీఎన్ఏ పరీక్ష కోసం పంపారు. నిందితుడు అఫ్తాబ్ కు నార్కో పరీక్షలకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. మరో కొన్ని రోజుల్లో డీఎన్ఏ ఫలితాలు రానున్నాయి. ఈ డీఏఎన్ఏ శ్రద్ధా తండ్రితో సరిపోలితే.. కేసు మరింత బలపడే అవకాశం ఉంది.
#WATCH | Gujarat: Aftaab killed Shardha & chopped her body into 35 pieces. When police asked why he brought only Hindu girls he said he did it because they're emotional.There're other Aftaab-Shradha too,country needs strict law against 'Love Jihaad': Assam CM HB Sarma in Dhansura pic.twitter.com/5PEc7HsvVh
— ANI (@ANI) November 22, 2022
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!