Assam: పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన నిందితులకు బుల్డోజర్ ట్రీట్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో యోగీ తరువాత బుల్డోజర్లను బాగా వాడుతుంది ఎవరంటే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. ఎదైనా ప్రభుత్వ వ్యతిరేఖ పనులకు పాల్పడ్డా… నేరాలకు పాల్పడ్డా నిందితులకు బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. తాజాగా మరోసారి తన మార్క్ చూపించారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన అల్లరి మూకల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేశారు అక్కడి అధికారులు.
శనివారం అస్సాం నాగోవ్ జిల్లా బటాద్రాబా పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టింది కొంతమంది అల్లరి మూక. పోలీస్ కస్టడీలో ఉన్న సఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తి అనుకోకుండా మరణించాడు. దీంతో పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మరణించాడని ఆరోపిస్తూ కొంత మంది బటద్రాబా పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. స్టేషన్ లోని ఫర్నీచర్ ధ్వసం చేయడంతో పాటు స్టేషన్ కు నిప్పు పెట్టారు. ఈ దాడిలో ఇద్దరు పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు

అయితే ఈ వివాదంపై అస్సాం డీజీపీ స్పందించారు. సఫీకులు ఇస్లాం దురదృష్టవశాత్తూ మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. దీనికి బాధ్యతగా బటద్రాబా పీస్ అధికారిని సస్పెండ్ చేశామని… మా దగ్గర తప్పు ఉంటే దోషులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తామని అన్నారు. అయితే కొంతమంది మాత్రం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పీఎస్ ను తగలబెట్టారని.. వారంతా చనిపోయిన వ్యక్తి బంధువులుగా మేం భావించడం లేదని… వారందరికి నేర చరిత్ర ఉందని అస్సాం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత అన్నారు.
ఇదిలా ఉంటే నిన్న జరిగిన దాడికి బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇచ్చింది నిందితులకు. ఘటనకు ప్రధాన కారణంగా భావిస్తున్న ఐదు కుటుంబాలకు చెందిన ఇళ్లను నాగోవ్ జిల్లా యంత్రాంగం కూల్చివేసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?