AAP: ఆమ్ఆద్మీలో కొత్త జోష్.. ఆ పార్టీ గూటికి కీలక నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీకే పరిమితం అవుతుంది అనుకున్న ఆమ్ఆద్మీ పార్టీ.. క్రమంగా విస్తరణ చర్యలు ప్రారంభించింది.. తాజాగా ఎన్నికలు జరిగిన పంజాబ్పై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. తిరుగులేని విజయాన్ని అందుకుని ఔరా..! అనిపించింది.. ఈ విజయం ఆ పార్టీ నేతలకు బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.. పార్టీలో కొత్త జోష్ వచ్చింది.. ఇదే సమయంలో 2024లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెడుతోంది ఆమ్ఆద్మీ పార్టీ.. ఇవాళ హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ ఆప్ తీర్థం పుచ్చుకున్నారు.. గత ఏడాది నవంబర్లో కాంగ్రెస్కు గుడ్బై చెప్పి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరిన ఆయన.. ఇప్పుడు దీదీ పార్టీకి బైబై చెప్పి చీపురు పట్టారు.. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ కేజ్రీవాల్ సమక్షంలో పార్టీలో చేరారు. 2024లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హర్యానాలో తన పార్టీ విస్తరణకు ఇది దోహద పడుతుందని ఆప్ అంచనా వేస్తోంది.
Read Also: TS: హస్తిన నుంచి గవర్నర్ తమిళిసైకి పిలుపు.. ఏం జరుగుతోంది..?
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇక, తన్వర్ను పార్టీలోకి ఆహ్వానించిన కేజ్రీవాల్ తన రాజకీయ అనుభవం ఖచ్చితంగా హర్యానాలో మరియు దేశవ్యాప్తంగా ఆప్కి గొప్ప సహాయం చేస్తుందని అన్నారు. “ఆమ్ ఆద్మీ పార్టీ కుటుంబానికి స్వాగతం, అశోక్ జీ. విద్యార్థి రాజకీయాల నుండి పార్లమెంటు వరకు మీ రాజకీయ అనుభవం హర్యానాలో మరియు దేశవ్యాప్తంగా పార్టీ సంస్థకు ఎంతగానో సహాయపడుతుంది” అంటూ ట్వీట్ చేశారు ఆమ్ఆద్మీ చీఫ్.. కాగా, ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడైన తన్వర్.. అంతకుముందు హర్యానాలోని సిర్సా నుంచి ఎంపీగా ఉన్నారు. 2019లో ఆయన కాంగ్రెస్ను వీడారు. ఆయన హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, ఇండియన్ యూత్ కాంగ్రెస్ మరియు పార్టీ విద్యార్థి విభాగం (ఎన్ఎస్యూఐ) అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
తాజావార్తలు
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!