Asaduddin Owaisi: త్రివర్ణ పతాకంలో ఆకుపచ్చ రంగును మోదీ ప్రభుత్వం తొలగిస్తుందా..?
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. పార్లమెంటులో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం త్రివర్ణ పతాకంలో ఆకుపచ్చ రంగును తొలగిస్తుందా..? అని ప్రశ్నించారు. పచ్చదనంలో ప్రభుత్వానికి ఎందుకు ఇన్ని ఇబ్బందులు అని అడిగారు. చైనా చొరబాటుపై ప్రధాని మోదీ మాట్లాడరా..? బిల్కిస్ బానోకు న్యాయం చేస్తారా.? అని ప్రశ్నించారు.
Read Also: Smriti Irani Daughter: స్మృతి ఇరానీ కూతురి పెళ్లి.. ముస్తాబైన రాజకోట
Also Read
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
2023 కేంద్ర బడ్జెట్లో మైనారిటీ పథకాలకు నిధులను తగ్గించినందుకు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 38 శాతం తగ్గించబడ్డాయని అన్నారు. దేశంలోని ముస్లింలు చదువుకోవడం బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపించారు. పస్మాండ ముస్లింలపై మీకు అంత ప్రేమ ఉంటే దళిత ముస్లిం హోదా ఇవ్వాటని.. బీహార్ ముస్లింలకు ఓబీసీ హోదా కావాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీజేపీలు ఓలిగార్చ్ లకు జన్మనిచ్చాయని.. దేశ సంపదతో పలువురు పారిపోతున్నారని.. పారిపోయిన వ్యక్తుల జాబితాలో మొఘల్ ల పేరు ఉందా..? దీనిపై మీరు ఏం మాట్లాడరు అని అన్నారు. హిండెన్బర్గ్ భారతదేశంలో ఉంటే, అది చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టాన్ని ఎదుర్కొనేది అని అన్నారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై ఇటీవల ఓ నివేదికను ఇచ్చాయి. దీంతో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు పడిపోయాయి. ఓవైసీ మాట్లాడుతూ.. ప్రార్థనా స్థలాల చట్టానికి భంగం కలిగించవద్దని అభ్యర్థించారు. ప్రధాని చైనాకు భయపడవద్దని, మైనారిటీ బడ్జెట్ పెంచాలని సూచించారు.
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!