Asaduddin Owaisi: త్రివర్ణ పతాకంలో ఆకుపచ్చ రంగును మోదీ ప్రభుత్వం తొలగిస్తుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. పార్లమెంటులో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం త్రివర్ణ పతాకంలో ఆకుపచ్చ రంగును తొలగిస్తుందా..? అని ప్రశ్నించారు. పచ్చదనంలో ప్రభుత్వానికి ఎందుకు ఇన్ని ఇబ్బందులు అని అడిగారు. చైనా చొరబాటుపై ప్రధాని మోదీ మాట్లాడరా..? బిల్కిస్ బానోకు న్యాయం చేస్తారా.? అని ప్రశ్నించారు.
Read Also: Smriti Irani Daughter: స్మృతి ఇరానీ కూతురి పెళ్లి.. ముస్తాబైన రాజకోట
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
2023 కేంద్ర బడ్జెట్లో మైనారిటీ పథకాలకు నిధులను తగ్గించినందుకు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 38 శాతం తగ్గించబడ్డాయని అన్నారు. దేశంలోని ముస్లింలు చదువుకోవడం బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపించారు. పస్మాండ ముస్లింలపై మీకు అంత ప్రేమ ఉంటే దళిత ముస్లిం హోదా ఇవ్వాటని.. బీహార్ ముస్లింలకు ఓబీసీ హోదా కావాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీజేపీలు ఓలిగార్చ్ లకు జన్మనిచ్చాయని.. దేశ సంపదతో పలువురు పారిపోతున్నారని.. పారిపోయిన వ్యక్తుల జాబితాలో మొఘల్ ల పేరు ఉందా..? దీనిపై మీరు ఏం మాట్లాడరు అని అన్నారు. హిండెన్బర్గ్ భారతదేశంలో ఉంటే, అది చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టాన్ని ఎదుర్కొనేది అని అన్నారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై ఇటీవల ఓ నివేదికను ఇచ్చాయి. దీంతో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు పడిపోయాయి. ఓవైసీ మాట్లాడుతూ.. ప్రార్థనా స్థలాల చట్టానికి భంగం కలిగించవద్దని అభ్యర్థించారు. ప్రధాని చైనాకు భయపడవద్దని, మైనారిటీ బడ్జెట్ పెంచాలని సూచించారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!