Kejriwal: కేజ్రీవాల్కు ప్రభుత్వ క్వార్టర్ కేటాయింపుపై కేంద్రం కీలక ప్రకటన
- కేజ్రీవాల్కు ప్రభుత్వ క్వార్టర్ కేటాయింపుపై కేంద్రం కీలక ప్రకటన
- త్వరలోనే ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తామని కేంద్రమంత్రి ఖట్టర్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. త్వరలో ప్రభుత్వ క్వార్టర్ కేటాయిస్తామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రస్తుతం అన్ని రకాల బంగ్లాలు నిండిపోయి ఉన్నాయని చెప్పారు. అందుబాటులోకి రాగానే కేజ్రీవాల్కు వసతి కల్పిస్తామని చెప్పారు. జాతీయ పార్టీ అధినేతగా కేజ్రీవాల్ అర్హులని వెల్లడించారు. ప్రస్తుతం ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో కేజ్రీవాల్ నివాసం ఉంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ జైలు కెళ్లారు. దాదాపు 6 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. అనంతరం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి ఇంటికి చేరుకున్నాక.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి సీటులో అతిషిని కూర్చోబెట్టారు. అనంతరం కేజ్రీవాల్ ఖాళీ చేసిన నివాసంలోకి అతిషి మకాం మార్చారు. వాస్తవానికి జాతీయ పార్టీ అధినేతగా కేజ్రీవాల్కు ప్రభుత్వ బంగ్లాను కేటాయించాల్సి ఉంటుంది. కానీ అప్పుడు కేటాయించలేదు. దీంతో కేజ్రీవాల్.. పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లోకి మారిపోయారు. తాజాగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిస్తూ.. జాతీయ పార్టీ అధినేత కేజ్రీవాల్ అర్హులని.. త్వరలోనే ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తామని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం తెలిపారు.
Also Read
జాతీయ పార్టీ అధినేతగా కేజ్రీవాల్కు బంగ్లా కేటాయించాలని కేంద్రానికి ఆప్ లేఖ రాసింది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖకు లేఖ పంపింది. అయితే తాజాగా మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిస్తూ.. ప్రస్తుతం తమ దగ్గర V మరియు VI రకం బంగ్లాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. VII రకం బంగ్లాలు అందుబాటులో లేవని తెలిపారు. VII రకం బంగ్లాలు అందుబాటులోకి రాగానే కేటాయిస్తామని ఖట్టర్ తెలిపారు.
ఇదిలా ఉంటే వచ్చే నెలలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఆప్ ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో 11 మంది, రెండో విడతలో 20 మంది అభ్యర్థులను వెల్లడించింది. ఇక కాంగ్రెస్, బీజేపీ కూడా కసరత్తు ప్రారంభించాయి. ఈసారి ఢిల్లీలో త్రిముఖ పోటీ నెలకొంది. హస్తిన వాసులు ఈసారి ఎవరికి పట్టం కడతారో చూడాలి.
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!