Arvind Kejriwal: కాంగ్రెస్ పనైపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress is finished in Gujarat, says Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన అహ్మదాబాద్ నగరంలో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం అయిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా.. గుజరాత్ ఎన్నికల కోసం ఆప్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపణలపై కేజ్రీవాల్ స్పందించారు. కాంగ్రెస్ వారి ప్రశ్నలు ఆడగటం మానేయండి.. గుజరాత్ తో కాంగ్రెస్ పని అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ పట్టించుకోరని ఆయన అన్నారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Mrunal Thakur: అతడితో పిల్లలను కనాలని ఉందంటున్న సీత..
ఢిల్లీ తరువాత ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి.. అధికారాన్ని చేపట్టింది. ఢిల్లీ వెలుపల తొలిసారిగా పంజాబ్ రాష్ట్రంలో పాగా వేసింది. ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ సారి ఈ రెండు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటోంది.
గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న కేజ్రీవాల్.. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా లేదని.. బీజేపీకి ఆప్ మాత్రమే ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని ప్రజలను కోరుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పాలన అక్కర లేదని.. ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు.
2017 ఎన్నికల్లో గుజరాత్ లోకి అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. అయితే పంజాబ్ రాష్ట్రం ఇచ్చిన ఊపుతో గుజరాత్ లో పాగా వేయాలని చూస్తోంది. ఆ ఎన్నికల్లో 182 సీట్లలో 99 స్థానాలను బీజేపీ గెలుచుకుంటే.. 77 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని గట్టిపోటీ ఇచ్చింది. 2024 ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గుజరాత్, హిమాచల్ ఎన్నికలు కీలకంగా మారాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!