Arvind Kejriwal: కాంగ్రెస్ పనైపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress is finished in Gujarat, says Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన అహ్మదాబాద్ నగరంలో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం అయిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా.. గుజరాత్ ఎన్నికల కోసం ఆప్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపణలపై కేజ్రీవాల్ స్పందించారు. కాంగ్రెస్ వారి ప్రశ్నలు ఆడగటం మానేయండి.. గుజరాత్ తో కాంగ్రెస్ పని అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ పట్టించుకోరని ఆయన అన్నారు.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Read Also: Mrunal Thakur: అతడితో పిల్లలను కనాలని ఉందంటున్న సీత..
ఢిల్లీ తరువాత ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి.. అధికారాన్ని చేపట్టింది. ఢిల్లీ వెలుపల తొలిసారిగా పంజాబ్ రాష్ట్రంలో పాగా వేసింది. ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ సారి ఈ రెండు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటోంది.
గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న కేజ్రీవాల్.. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా లేదని.. బీజేపీకి ఆప్ మాత్రమే ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని ప్రజలను కోరుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పాలన అక్కర లేదని.. ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు.
2017 ఎన్నికల్లో గుజరాత్ లోకి అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. అయితే పంజాబ్ రాష్ట్రం ఇచ్చిన ఊపుతో గుజరాత్ లో పాగా వేయాలని చూస్తోంది. ఆ ఎన్నికల్లో 182 సీట్లలో 99 స్థానాలను బీజేపీ గెలుచుకుంటే.. 77 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని గట్టిపోటీ ఇచ్చింది. 2024 ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గుజరాత్, హిమాచల్ ఎన్నికలు కీలకంగా మారాయి.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!