Article 370: ‘‘ఆర్టికల్ 370ని తీసేయలేరు’’.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Article 370: జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ‘ఆర్టికల్ 370’ని బీజేపీ నేతృత్వంలోని 2019లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ మళ్లీ సుప్రీంకోర్టులో ‘రివ్యూ పిటిషన్’ దాఖలైంది.
J&K పీపుల్స్ మూవ్మెంట్ అధ్యక్షుడు డాక్టర్ హుస్సేన్ మరియు J&K అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ముజాఫర్ షా మాట్లాడుతూ..తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. ‘‘ ఆర్టికల్ 370ని తీసేయలేమని.. ఆర్టికల్ 370పై సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని, మేము కోర్టులో కోర్టులో చర్చిస్తాము’’ అని ముజఫర్ షా చెప్పారు. సీపీఐ(ఎం)కి చెందిన మహ్మద్ యూసుఫ్ తరిగామి, నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన అడ్వకేట్ ముజఫర్ ఇక్బాల్, పీడీపీలు కూడా రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: 12th Fail: రియల్ లైఫ్ “12th ఫెయిల్” ఐపీఎస్ ఆఫీసర్, భార్యతో ఉన్న ఫోటోలు వైరల్..
గత నెలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్తో పాటు న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్ మరియు సూర్యకాంత్లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370ని రద్దుని సమర్థించింది. ఇది తాత్కాలిక నిబంధన మాత్రమే అని నొక్కి చెప్పింది. యుద్ధకాల పరిస్థితుల కారణంగా ఆర్టికల్ 370 రూపొందించబడిందని చెప్పింది. భారత యూనియన్లో చేరిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండలేదని సుప్రీం వ్యాఖానించింది. రాజ్యాంగ పరిషత్ ఆగిపోయినందున ఆర్టికల్ 370 శాశ్వతంగా కొనసాగుతుందని అర్థం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీని రద్దుకు ఉత్తర్వులు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని సుప్రీం పేర్కొంది. సెప్టెంబర్ 30, 2024లోగా జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించేలా భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆగస్టు 5, 2019న, ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ, ఆ ప్రాంతాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
తాజావార్తలు
-
US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
-
Astrology: జూన్ 27 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!