Apple: ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. అప్పటి నుంచి ఐ ఫోన్లలో 5జీ సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple Users In India To Get 5G From Next Week: భారతదేశంలోని ఆపిల్ యూజర్లకు శుభవార్త చెప్పింది ఆ సంస్థ. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 5జీ సేవల గురించి క్లారిటీ ఇచ్చింది. 5జీ నెట్ వర్క్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లను వచ్చే వారం నుంచి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆపిల్ తన ఐఓఎస్ 16 బీటా సాఫ్ట్వేర్ అప్డేట్ను అందుబాటులోకి తెస్తోంది.
Read Also: Gujarat Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
Also Read
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
- PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
- Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12. ఐఫోన్ ఎస్ఈ( థర్డ్ జనరేషన్) మోడళ్లలో 5జీ సేవలను పొందవచ్చు. ఎయిర్ టెల్, రిలయన్స్ జియో కస్టమర్లు ఈ ఫోన్లలో బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ను ఉపయోగించి 5 జీ సేవలను పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ సాఫ్ట్వేర్ పై వినియోగదారులు తమ ఫీడ్ బ్యాక్ అందిచాలని సంస్థ కోరుతోంది. దీని వల్ల సమస్యలను, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ను మరింతగా మెరుగుపరిచే అవకాశం ఏర్పడనుంది. ఐఫోన్ వినియోగదారులు ప్రోగ్రామ్, సాఫ్ట్వేర్ రెండింటిని ఉచితంగా పొందవచ్చని ఆపిల్ చెప్పింది. సరైన ఆపిల్ ఐడీ కలిగిన వారు బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ను సైన్ అప్ ప్రాసెస్ ద్వారా ఓపెన్ చేయొచ్చని తెలిపింది.
సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా 5జీ ప్రారంభించబడుతుందని.. డిసెంబర్లో ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 1న ఢిల్లీలో జరిగిన 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ 5 జీ సేవలను ప్రారంభించారు. ప్రస్తుతం ఎయిర్ టెల్ ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్పూర్, వారణాసి నగరాల్లో సేవలను ప్రారంభించింది. 2023 నాటికి దేశం మొత్తం 5 జీ సేవలను అందిస్తామని వెల్లడించింది. మరోవైపు జియో ఢిల్లీ ,ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో తన సేవలను ప్రారంభించింది. 2023 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు తమ సేవలను విస్తరిస్తామని వెల్లడించింది.
తాజావార్తలు
-
Peddi : ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
-
Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
-
Yogibabu : సత్య – యోగి బాబు నవ్వుల బాంబ్..’రంగబలి’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
-
Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?