Apple: ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. అప్పటి నుంచి ఐ ఫోన్లలో 5జీ సేవలు
Apple Users In India To Get 5G From Next Week: భారతదేశంలోని ఆపిల్ యూజర్లకు శుభవార్త చెప్పింది ఆ సంస్థ. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 5జీ సేవల గురించి క్లారిటీ ఇచ్చింది. 5జీ నెట్ వర్క్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లను వచ్చే వారం నుంచి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆపిల్ తన ఐఓఎస్ 16 బీటా సాఫ్ట్వేర్ అప్డేట్ను అందుబాటులోకి తెస్తోంది.
Read Also: Gujarat Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
Also Read
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12. ఐఫోన్ ఎస్ఈ( థర్డ్ జనరేషన్) మోడళ్లలో 5జీ సేవలను పొందవచ్చు. ఎయిర్ టెల్, రిలయన్స్ జియో కస్టమర్లు ఈ ఫోన్లలో బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ను ఉపయోగించి 5 జీ సేవలను పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ సాఫ్ట్వేర్ పై వినియోగదారులు తమ ఫీడ్ బ్యాక్ అందిచాలని సంస్థ కోరుతోంది. దీని వల్ల సమస్యలను, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ను మరింతగా మెరుగుపరిచే అవకాశం ఏర్పడనుంది. ఐఫోన్ వినియోగదారులు ప్రోగ్రామ్, సాఫ్ట్వేర్ రెండింటిని ఉచితంగా పొందవచ్చని ఆపిల్ చెప్పింది. సరైన ఆపిల్ ఐడీ కలిగిన వారు బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ను సైన్ అప్ ప్రాసెస్ ద్వారా ఓపెన్ చేయొచ్చని తెలిపింది.
సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా 5జీ ప్రారంభించబడుతుందని.. డిసెంబర్లో ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 1న ఢిల్లీలో జరిగిన 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ 5 జీ సేవలను ప్రారంభించారు. ప్రస్తుతం ఎయిర్ టెల్ ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్పూర్, వారణాసి నగరాల్లో సేవలను ప్రారంభించింది. 2023 నాటికి దేశం మొత్తం 5 జీ సేవలను అందిస్తామని వెల్లడించింది. మరోవైపు జియో ఢిల్లీ ,ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో తన సేవలను ప్రారంభించింది. 2023 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు తమ సేవలను విస్తరిస్తామని వెల్లడించింది.
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!