Neha Murder Case: ‘‘ నా కొడుకును శిక్షించండి’’.. ఫయాజ్ తండ్రి క్షమాపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neha Murder Case: కర్ణాటక హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హత్య కేసు సంచలనంగా మారింది. ఈ హత్య రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఫస్ట్ ఇయర్ ఎంసీఏ స్టూడెంట్ నేహా(22)ని ఫయాజ్(23) అనే వ్యక్తి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన కాలేజ్ క్యాంపస్లోనే చోటు చేసుకుంది. దీనిపై బీజేపీ, అధికార కాంగ్రెస్ పార్టీని నిందిస్తోంది. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని బీజేపీ మండిపోడుతోంది, అంతే కాకుండా ఈ హత్యలో ‘లవ్ జిహాద్’ కోణం ఉన్నట్లు ఆరోపించింది. అయితే, ఇది వ్యక్తిగత విషయమని, ఇందులో లవ్ జిహాద్ కోణం లేదని చెప్పింది. అయితే, నేహా తండ్రి నిరంజన్ హిరేమత్ కూడా తన బిడ్డను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు.
Read Also: Shriya Saran: శ్రీయ అందాలకి కుర్రకారు ఫిదా…
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
ఇదిలా ఉంటే ఈ హత్యపై నిందితుడు ఫయాజ్ తండ్రి స్పందించారు. నేహను చంపిన తన కుమారుడిని కఠినంగా శిక్షించాలని కోరాడు. పాఠశాల ఉపాధ్యాయుడైన ఫయాజ్ తండ్రి బాబా సాహెబ్ సుబానీ శనివారం మీడియాలో మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం 6 గంటల కు తనకు సంఘటన గురించి తెలిసిందని, తన కుమారుడి చర్యతో దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. ‘‘భవిష్యత్తులో ఇలాంటి పనిచేయడానికి భయపడే విధంగా అతని శిక్ష ప డాలి. నేహా కుటుంబాన్ని చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా. ఆమె నా కూతురు లాంటిది’’ అని కన్నీటి పర్యంతమయ్యారు. గత ఆరేళ్లుగా తాను, తన భార్య వేరువేరుగా ఉంటున్నామని, ఫయాజ్ తల్లి దగ్గరే ఉంటున్నాడని, 3 నెలల క్రితం చివరిసారిగా తన కొడుకుతో మాట్లాడినట్లు వెల్లడించారు.
8 నెలల క్రితం నేహా కుటుంబం తనకు ఫోన్ చేసి తన కుమారుడు, నేహాను వేధిస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. తన కొడుకు తప్పు చేశాడని ఒప్పుకుంటూనే.. ఫయాజ్, నేహ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, రిలేషన్ షిప్లో ఉన్నారని చెప్పాడు. ఫయాజ్ ఆమెను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడని, కానీ నేను దానికి నిరాకరించానని నిందితుడి తండ్రి అన్నారు. ‘‘ మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. నన్ను క్షమించాలని కర్ణాటక ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను.’’ అని అన్నారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని అప్పుడే తమ కుమార్తె ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!