CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: తమిళనాడులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తు్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు.. కేంద్ర మంత్రి పియూష్ గోయల్తో కలిసి జరిగిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి కోసం తాను మాట్లాడుతున్నానని, అందుకే జాతీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఘనమైన చరిత్ర, వారసత్వం, సంపద కలిగిన రాష్ట్రం అని కొనియాడారు. తమిళ ప్రజలకు తమ భాషపై అపారమైన ప్రేమ ఉందని, కష్టించి పనిచేసే స్వభావం వారిదని అన్నారు. తమిళనాడు నుంచి ఎంతో మంది ఉన్నతాధికారులు, ప్రముఖులు దేశానికి సేవ చేశారని గుర్తుచేశారు.
Also Read
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
ఇక, ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకు తాగునీరు అందిందని చంద్రబాబు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రజల మధ్య అన్నదమ్ముల బంధం ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న సీట్లపై 50 శాతం పెంపుతో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం మంచి ఫార్ములా అని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్, డీఎంకే తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు.. రాహుల్ గాంధీ, స్టాలిన్ వంటి నేతలు బిల్లులను అడ్డుకోవడం ద్వారా మహిళలకు అన్యాయం చేశారని చంద్రబాబు ఆరోపించారు.
తమిళనాడులో అభివృద్ధి మందగించిందని, చెన్నై వంటి నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయని అన్నారు చంద్రబాబు… రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, మహిళలపై నేరాలు, కస్టోడియల్ మరణాలు, డ్రగ్స్ సమస్యలు పెరిగాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చెన్నై రైల్వే స్టేషన్ ఆధునీకరణకు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిందని తెలిపారు. త్వరలో చెన్నై-బెంగళూరు-అమరావతి నగరాలను అనుసంధానించే హైస్పీడ్ రైలు కారిడార్కు కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కీలకమవుతుందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!