CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: తమిళనాడులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తు్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు.. కేంద్ర మంత్రి పియూష్ గోయల్తో కలిసి జరిగిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి కోసం తాను మాట్లాడుతున్నానని, అందుకే జాతీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఘనమైన చరిత్ర, వారసత్వం, సంపద కలిగిన రాష్ట్రం అని కొనియాడారు. తమిళ ప్రజలకు తమ భాషపై అపారమైన ప్రేమ ఉందని, కష్టించి పనిచేసే స్వభావం వారిదని అన్నారు. తమిళనాడు నుంచి ఎంతో మంది ఉన్నతాధికారులు, ప్రముఖులు దేశానికి సేవ చేశారని గుర్తుచేశారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ఇక, ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకు తాగునీరు అందిందని చంద్రబాబు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రజల మధ్య అన్నదమ్ముల బంధం ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న సీట్లపై 50 శాతం పెంపుతో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం మంచి ఫార్ములా అని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్, డీఎంకే తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు.. రాహుల్ గాంధీ, స్టాలిన్ వంటి నేతలు బిల్లులను అడ్డుకోవడం ద్వారా మహిళలకు అన్యాయం చేశారని చంద్రబాబు ఆరోపించారు.
తమిళనాడులో అభివృద్ధి మందగించిందని, చెన్నై వంటి నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయని అన్నారు చంద్రబాబు… రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, మహిళలపై నేరాలు, కస్టోడియల్ మరణాలు, డ్రగ్స్ సమస్యలు పెరిగాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చెన్నై రైల్వే స్టేషన్ ఆధునీకరణకు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిందని తెలిపారు. త్వరలో చెన్నై-బెంగళూరు-అమరావతి నగరాలను అనుసంధానించే హైస్పీడ్ రైలు కారిడార్కు కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కీలకమవుతుందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Diabetes: షుగర్ కంట్రోల్కు ఈ 3 కూరగాయలు బెస్ట్.. నిపుణుల సూచనలు ఇవే
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!