Anti-India agenda: రామనవమి హింసపై ముస్లిం దేశాల కూటమి ప్రేలాపన.. తీవ్రంగా స్పందించిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anti-India agenda: భారత్ అంటేనే నిలువెల్ల విషంలో మాట్లాడుతుంటుంది ముస్లిం దేశాల కూటమి ‘‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ)’’. ఇప్పటికే పలుమార్లు భారత అంతర్గత విషయాలపై స్పందిస్తూ ఇండియాకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసింది. అయితే ఎప్పటికప్పుడు ఐఓసీ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఇదిలా ఉంటే తాజాగా రామనవమి అల్లర్లపై ఓఐసీ అర్థపర్థం లేని ఆరోపనలు చేసింది. దీంతో మరోసారి తీవ్రంగా స్పందించింది భారత్.
రామ నవమి సందర్భంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఓఐసీ సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓఐసీ మతతత్వ ఆలోచనతో, భారత వ్యతిరేక ఎజెండాతో పనిచేస్తుందని నిందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. ఓఐసీ విడుదల చేసి ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, భారత వ్యతిరేక శక్తులచే వంతపాడుతూ ఐఓసీ తమ ప్రతిష్టను దెబ్బతీస్తోందని బాగ్చీ అన్నారు.
Also Read
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
Read Also: Home Theatre Blast: హోం థియేటర్ పేలుడులో ట్విస్ట్.. బాంబు పెట్టి గిఫ్టుగా ఇచ్చిన పెళ్లికూతురు లవర్..
భారతదేశంలో ముస్లిం సమాజంపై ఇస్లామోఫోబియా పెరిగిందని, రెచ్చగొట్టే హింస, విధ్వంసక చర్యలను ఖండిస్తున్నట్లు ఓఐసీ ఓ ప్రకటనలో పేర్కొంది. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ ను కోరింది. దేశంలోని ముస్లిం సమాజం భద్రత, హక్కులు, గౌరవాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. దీనిపై భారత్ కూడా అంతే ఘాటు స్పందిస్తూ ఓఐసీ వ్యాఖ్యలను ఖండించింది.
రామనవమి రోజు దేశంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన మతకలహాలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ హౌరా, హుగ్లీల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. బీహార్ నలంద, ససారం, బీహార్ షరీఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. మహారాష్ట్ర, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో అల్లర్లు జరిగాయి.
తాజావార్తలు
-
Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్’
-
Huawei Nova 16 Series: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. హువావే నోవా 16 సిరీస్ రిలీజ్
-
Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
-
PM Kisan Yojana: రైతులకు అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు!
-
Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!