Anti-India agenda: రామనవమి హింసపై ముస్లిం దేశాల కూటమి ప్రేలాపన.. తీవ్రంగా స్పందించిన భారత్..
Anti-India agenda: భారత్ అంటేనే నిలువెల్ల విషంలో మాట్లాడుతుంటుంది ముస్లిం దేశాల కూటమి ‘‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ)’’. ఇప్పటికే పలుమార్లు భారత అంతర్గత విషయాలపై స్పందిస్తూ ఇండియాకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసింది. అయితే ఎప్పటికప్పుడు ఐఓసీ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఇదిలా ఉంటే తాజాగా రామనవమి అల్లర్లపై ఓఐసీ అర్థపర్థం లేని ఆరోపనలు చేసింది. దీంతో మరోసారి తీవ్రంగా స్పందించింది భారత్.
రామ నవమి సందర్భంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఓఐసీ సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓఐసీ మతతత్వ ఆలోచనతో, భారత వ్యతిరేక ఎజెండాతో పనిచేస్తుందని నిందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. ఓఐసీ విడుదల చేసి ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, భారత వ్యతిరేక శక్తులచే వంతపాడుతూ ఐఓసీ తమ ప్రతిష్టను దెబ్బతీస్తోందని బాగ్చీ అన్నారు.
Also Read
Read Also: Home Theatre Blast: హోం థియేటర్ పేలుడులో ట్విస్ట్.. బాంబు పెట్టి గిఫ్టుగా ఇచ్చిన పెళ్లికూతురు లవర్..
భారతదేశంలో ముస్లిం సమాజంపై ఇస్లామోఫోబియా పెరిగిందని, రెచ్చగొట్టే హింస, విధ్వంసక చర్యలను ఖండిస్తున్నట్లు ఓఐసీ ఓ ప్రకటనలో పేర్కొంది. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ ను కోరింది. దేశంలోని ముస్లిం సమాజం భద్రత, హక్కులు, గౌరవాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. దీనిపై భారత్ కూడా అంతే ఘాటు స్పందిస్తూ ఓఐసీ వ్యాఖ్యలను ఖండించింది.
రామనవమి రోజు దేశంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన మతకలహాలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ హౌరా, హుగ్లీల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. బీహార్ నలంద, ససారం, బీహార్ షరీఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. మహారాష్ట్ర, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో అల్లర్లు జరిగాయి.
తాజావార్తలు
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!