Karnataka: నలుగురు మైనర్లపై లైంగిక వేధింపులు..లింగాయత్ పీఠాధిపతిపై మరో కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Another case against Lingayat seer Shivamurthy for Physical assaulting minor girls: అత్యాచార ఆరోపణలో అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్న లింగాయత్ పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణరుపై మరో కేసు నమోదు అయింది. నలుగురు మైనర్ బాలికపై గత కొన్నాళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపించడంతో తాజా కేసు నమోదు అయింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన గతంలో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ కేసులో ప్రజలు, ప్రజాసంఘాల నుంచి తీవ్రమైన ఒత్తడి రావడంతో శివమూర్తి మురుగ శరణరును అరెస్ట్ చేశారు.
లింగాయత్ మఠాధిపతి శివమూర్తి జనవరి 2019 నుంచి జూన్ 2022 మధ్య అనేకసార్లు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలికలు ఆరోపించారు. మైసూరులోని నజరాబాద్ పోలీస్ స్టేషన్లో పిల్లల తల్లిదండ్రులు శివమూర్తిపై ఫిర్యాదు చేశారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా మఠంలోని హాస్టల్ వార్డెన్ తో సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. లైంగిక వేధింపులకు పాల్పడిన లింగాయత్ మఠాధిపతిపై ఇది రెండో పోక్సో కేసు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: Lakshmi Parvathi: ఛీ ఛీ.. బాలకృష్ణను చూస్తుంటే పరమ అసహ్యం వేస్తోంది.. ఎన్టీఆర్ కొడుకేనా
గతంలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడనే ఆరోపణతో సెప్టెంబర్ నెలలో అతన్ని అరెస్ట్ చేశారు. ఆగస్టు 26న శివమూర్తిపై కేసు నమోదు అయింది. శివమూర్తిపై గతంలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. గతంలో ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి కేసులో ఐదుగురిపై కేసు నమోదు అయింది. మఠం నడుపుతున్న హాస్టల్ లో ఉంటూ చదువుతున్న 15,16 ఏళ్ల ఇద్దరు బాలికలపై మూడున్నరేళ్లకు పైగా లైంగిక వేధింపులకు పాల్పడటంతో కేసు నమోదు అయింది. లింగాయత్ కమ్యూనిటీ కర్ణాటకలో బాగా పలుకుబడి ఉన్న కమ్యూనిటీ. రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడి ఉన్నందున రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, పలు పార్టీలకు చెందిన నేతలు లింగాయత్ మఠాధిపతులకు వ్యతిరేకంగా మాట్లాడటం చేయడం లేదు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!