Annamalai: తమిళనాడులో బీజేపీ ఫలితాలపై అన్నామలై కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడులో తమ ఉనికిని చాటాలని భావించిన బీజేపీకి నిరాశే ఎదురైంది. ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు. ఎగ్జిట్ పోల్స్లో కనీసం 3 సీట్ల వరకు వస్తాయని అంతా భావించారు. కానీ నిజమైన ఫలితాల్లో సున్నాకే పరిమితమయ్యారు. ముఖ్యంగా బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న కోయంబత్తూర్ ఎంపీ స్థానం నుంచి ఆ పార్టీ చీఫ్ అన్నామలై గెలుస్తారని దేశం మొత్తం భావించింది. అయితే, ఈ స్థానంలో అధికార డీఎంకే అభ్యర్థి చేతిలో అన్నామలై ఓడిపోయారు. సీట్లు రాకున్నా గతంతో పోలిస్తే ఈసారి బీజేపీ తన సీట్ల శాతాన్ని పెంచుకుంది.
Also Read
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
- CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఓటమి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆదేశాన్ని అంగీకరిస్తు్న్నామని, మాకు ఆశించిన సీట్లు రాలేదని చెప్పారు. అయితే, మూడోసారి నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సంతోషం కలిగిస్తుందని అన్నారు. తాము తమిళనాడు నుంచి ఎన్డీయే కూటమికి మద్దతుగా ఎంపీలను పంపుతామని భావించామని చెప్పారు. ఎక్కడ పొరపాటు జరిగిందో విశ్లేషించుకుంటామని అన్నారు. ఇండియా కూటమి నుంచి ఎన్నికైన ఎంపీలకు కూడా అన్నామలై శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి మంచి పథకాలు తీసుకురావాలని కోరారు. ఈ ఎన్నికల్ని గుణపాఠంగా భావించి, గతంలో కన్నా మెరుగైన పనితీరును కనబరుస్తామని చెప్పారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మూడోసారి అధికారం ఏర్పాటు చేయడమనేది ఎంత కష్టమో తెలుసని, అయితే, నరేంద్రమోడీ మూడోసారి అధికారంలోకి వస్తున్నారని చెప్పారు. తమ ఓటు శాతం బాగా పెరిందని అన్నామలై చెప్పారు. కమలం గుర్తు రాష్ట్రంలోని 39 స్థానాల్లోని 23 చోట్ల గట్టిగా నిలబడిందని అన్నారు. 20 ఏళ్లలో తొలిసారి తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో బీజేపీకి మంచి ఓట్లు వచ్చాయని చెప్పారు. వచ్చేసారి ఓట్ల శాతాన్ని పెంచుకోవడమే కాకుండా ఎంపీలను తప్పకుండా పార్లమెంట్ పంపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
#WATCH | Tamil Nadu BJP chief K Annamalai says, "Narendra Modi ji is coming back to power for the third consecutive time. And if you look at the democratic system of India, we all know how difficult it is to form a government for the third consecutive time…With respect to the… pic.twitter.com/xYzOjvEcUC
— ANI (@ANI) June 5, 2024
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
2027 వరల్డ్కప్కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
-
Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!