Mobile Theft: జాగ్రత్త గురూ.. రైల్వే స్టేషన్స్ లో మొబైల్స్ ఇలా కూడా దొంగలిస్తున్నారు.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే అధికారులు, రైల్వే భద్రతా సిబ్బంది ఇటీవల రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రతపై దృష్టి సారిస్తున్నారు. అయినప్పటికీ, నేరస్థులు ఇప్పటికీ నేరాలు చేయడంలో మరికాస్త నైపుణ్యంతో చెలరేగిపోతున్నారు. ఇలాంటి కేసుల్లో రైల్వే అధికారులు కూడా ఎలాంటి ఆధారాలు కనుకోలేకపోతున్నారు. రైల్వే పరిపాలనలో రైళ్లలో జరిగే నేరాలను విజయవంతంగా ఎదురుకొనేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు నేరస్తులు కూడా తెలివిగా మారుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఓ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
Indian Army : అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి 5,000 చెట్లను నాటిన ఇండియన్ ఆర్మీ..
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
- Gautam Gambhir: టీ20 వరల్డ్కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
ప్రయాణీకులు రైలు ఎక్కినప్పుడు, ప్రతి ఒక్కరూ సాధారణంగా విండో సీటు కోసం చూస్తారు. అలాంటి సమయంలో హాయిగా కూర్చొని ఫోన్లో పాటలు లేదా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. కొంతమంది రైలు ఎక్కే ముందు సెల్ఫోన్లకు ఛార్జింగ్ పెడుతుంటారు. ఇకపోతే ప్రస్తుత వైరల్ వీడియోలో చూపిన ప్రయాణికుడు సరిగ్గా అదే చేశాడు. కిటికీ పక్కన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని కూర్చున్నాడు. అంతలోనే రైలు బయట స్టేషన్ లో ఉన్న ఒక దొంగ తన చేతివాటన్నీ ప్రదర్శించాడు. రైలు ప్లాట్ ఫామ్ నుండి మొదలు అవగానే కిటికీలోంచి చేయి వేసి ప్రయాణికుడి ఫోన్ దొంగిలించి పారిపోయాడు. దాంతో ఆ వ్యక్తి వెంటనే రైలు బయటకు రాలేకపోయిదు. అప్పటికే రైలు బయలుదేరింది. దీంతో పాటు పలువురు ప్రయాణికులు కూడా రైలు తలుపుల ముందు కిక్కిరిసిపోయారు.
ఇక ఈ వీడియో సోషల్ నెట్వర్క్ ఇన్స్టాగ్రామ్లోని ఓ వినియోగదారు ఖాతా ద్వారా పోస్ట్ చేయగా ఇప్పటికి 75 మిలియన్ల మంది పైగా చూశారు. 2 మిలియన్ల మంది ఈ వీడియోను లైక్ చేసారు. సోషల్ నెట్వర్క్ వినియోగదారులు ఈ పోస్ట్పై రకరకాలుగా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారు అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. అయితే, పోస్ట్ డిస్క్రిప్షన్లోని హ్యాష్ట్యాగ్ వీడియో సత్నా రైల్వే స్టేషన్కు సంబంధించినదని సూచిస్తుంది.
తాజావార్తలు
-
Raaka: ‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?.. మొత్తం బడ్జేట్ తెలిస్తే షేక్ కావాల్సిందే!
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
-
Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
-
Lenin Success Meet : అఖిల్ ‘లెనిన్’ గ్రాండ్ సక్సెస్ మీట్ ఎప్పుడు ఎక్కడంటే?
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
ట్రెండింగ్
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?