Annamalai: “తమిళనాడును కుదిపేస్తున్న జంట హత్యలు”.. విజయ్పై అన్నామలై ఫైర్
- తమిళనాడును కుదిపేస్తున్న జంట హత్యలు..
- సీఎం విజయ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు..
- సెలబ్రేషన్ మోడ్ నుంచి బయటకు రావాలని అన్నామలై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడులో జంట హత్యలు రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఇద్దరు చిన్నారుల హత్యలతో సీఎం విజయ్ సర్కార్ తీవ్ర ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులకే రాష్ట్రంలో శాంతిభద్రతల పరీక్షను ఎదుర్కొంటున్నారు. మదురై మీనాక్షి ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేయడం, కోయంబత్తూర్లో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య సంఘటనలు రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ నేత అన్నామలై టీవీకే ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. సెలబ్రేషన్ మోడ్ నుంచి బయటకు రావాలని అన్నారు. ‘‘డ్రగ్ మాఫియా, లైంగిక నేరస్తులు, హంతకులకు తమిళనాడులో ఫ్రీ పాస్ లభించింది. గత ప్రభుత్వాల నుంచి పాఠాలు నేర్చుకోని పోలీస్ వ్యవస్థ, సంబరాలలో ఉన్న టీవీకే ప్రభుత్వం ప్రజల భద్రతపై దృష్టిపెట్టడం లేదు’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ఇదే విషయంపై ఉదయనిధి స్టాలిన్ విజయ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇది తమిళనాడా? లేక ఉత్తర్ ప్రదేశా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పిన విజయ్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. అన్నాడీఎంకే నేత పళనిస్వామి కూడా టీవీకే సర్కార్ను తీవ్రంగా విమర్శించారు. మహిళలు, బాలికల భద్రతపై విజయ్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ.. పిల్లల కోసం భావోద్వేగ ప్రసంగాలు చేసిన విజయ్ ఇప్పుడు ఈ ఘటనలను చూసి ప్రేక్షకుడిగా మారిపోయారని అన్నారు.
ఇదిలా ఉంటే కోయంబత్తూర్ అత్యాచారం, హత్య ఘటనపై రాష్ట్ర పరిశ్రమల మంత్రి కీర్తనా స్పందించిన తీరుపై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా ప్రశ్నలకు నవ్వుతూ స్పందించారని బీజేపీ ఆరోపించింది. పోలీస్ ప్రెస్మీట్లో మహిళా ఉన్నతాధికారి నవ్వుతుండటంపై కూడా విమర్శలు దారి తీసింది. మరోవైపు, సీఎం విజయ్ డ్యామెజ్ కంట్రోల్ చేపట్టారు. ఇటీవల తూత్తుకుడి లో జరిగిన పోక్సో కేసులో విచారణ మూడు నెలల్లోనే పూర్తి చేసి, నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు తీర్పును ఆయన ప్రస్తావించారు. మహిళలు, పిల్లల రక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
తాజావార్తలు
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!