Anna Hazare: నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, గత 20 రోజులుగా పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ నిరాహారదీక్ష చేస్తున్నారు. అయితే, శనివారం ఆయన దీక్షను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు, ఆయనను సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే, సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు తెలిపారు. వాంగ్చుక్ 20 రోజులుగా నిరాహారదీక్షలో ఉన్నారని, కాబట్టి ప్రభుత్వం ఆయన సహనాన్ని పరీక్షించకూడదని అన్నారు. ప్రభుత్వం డిమాండ్లు అంగీకరించినా, అంగీకరించకున్నా తప్పకుండా చర్చలు జరపాలని ఆయన అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం మౌనం వీడాలని సూచించారు. ఏ సమస్యకైనా సంప్రదింపుల ద్వారానే పరిష్కారం లభిస్తుందని, ప్రభుత్వం తన వాదన వినిపించడంతో పాటు అవతలి పక్షం వాదనలు కూడా వినాలని, అప్పుడే పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
ఇదిలా ఉంటే, ఆస్పత్రిలో సోనమ్ వాంగ్చుక్ చికిత్సకు నిరాకరిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. ఘనాహారం తీసుకోకపోవడం వల్ల అతను నీరసపడ్డాడని, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నాయని, కీటోన్ విలువలు పెరిగాయని హెల్త్ బులెటిన్ చెప్పింది. ఆస్పత్రిలో చేర్చే సమయానికి ఆయన పూర్తి స్పృహలోనే ఉన్నారని, అతడి రక్తపోటు, పల్స్, ఆక్సిజన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు.

