Bhagwant Mann: ఖలిస్తానీ మద్దతుదారు అమృత్ పాల్ సింగ్ నుంచి పంజాబ్ సీఎంకి ప్రాణహాని..
- అమృత్పాల్ సింగ్తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్కి ప్రాణహాని..
- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పంజాబ్ పోలీసులు..
- మాజీ సీఎం బియాంత్ సింగ్ హత్యని ప్రస్తావించిన రాష్ట్ర్ర ప్రభుత్వం..
- అమృత్పాల్ సింగ్ అనుచరుల పిటిషన్లకు పోలీసులు సమాధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagwant Mann: ఖలిస్తాన్ మద్దతుదారు, ఈ ఏడాది పంజాబ్ లోని ఖదూర్ సాహిబ్ ఎంపీగా గెలిచిన అమృత్పాల్ సింగ్ నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కి ప్రాణహాని ఉందని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. అమృత్పాల్, అతడి సన్నిహితుల నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలకే కాకుండా, సీఎం ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పారు. పంజాబ్ పోలీసులు వారి వాదనలకు మద్దతుగా గతంలో అమృత్పాల్ సింగ్ చేసిన ప్రసంగాలకు సంబంధించి వీడియో క్లిప్లను ప్రస్తావించారు.
పంజాబ్ పోలీసులు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ముందు ఈ వాదనలు చేశారు. అమృత్సర్(రూరల్) ఎస్ఎస్పీ చరణ్జిత్ సింగ్ ద్వారా కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేయబడింది. అమృత్పాల్ సింగ్కి సంబంధించిన ఓ వీడియోలో.. దివంగత పంజాబ్ మాజీ సీఎ బియాంత్ సింగ్కి పట్టిన గతే భగవంత్ మాన్కి పడుతుందని హెచ్చరించాడు. బియాంత్ సింగ్ మార్గంలోనే ఆయన పనిచేస్తు్న్నారని, మానవబాంబుతో భగవంత్ మాన్ని హత్య చేస్తామని బెదిరించారు. ఈ వీడియోని పోలీసులు కోర్టు ముందు ఉంచారు.
Also Read
Read Also: Chiranjeevi: బ్రేకింగ్: గిన్నీస్ బుక్ లోకి చిరంజీవి
పంజాబ్ పోలీస్ అధికారి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఫిబ్రవరి 2023 అజ్నాలా పోలీస్ స్టేషన్ సంఘటన తర్వాత, అమ్రిత్పాల్ సింగ్ అజ్నాలా పోలీస్ స్టేషన్ వెలుపల మాట్లాడిన వీడియోలో.. మాజీ సీఎం బియాంత్ సింగ్కి పట్టిన విధినే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎదుర్కొంటారని హెచ్చరించారు. ‘‘సీఎం భగవంత్ మాన్, మాజీ సీఎం బియాంత్ సింగ్ దారిలో నడవద్దని హెచ్చరిస్తున్నాము. సీఎం మాన్ ఇప్పటికీ ఆయన దారిలోనే నడుస్తున్నాడు. దిలావర్ ఒక మానవబాంబుగా మారి సీఎం బియాంత్ సింగ్ని పేల్చేశాడు. ఈ రోజు ఈ జనసమూహం నుంచి అనేక మంది దిలావర్లు పుట్టుకొచ్చారని గుర్తుంచుకో. ’’ అని అమృత్పాల్ సింగ్ హెచ్చరించిన వీడియోని పంజాబ్ పోలీసులు ప్రస్తావించారు.
అమృత్పాల్ సింగ్ చేసిన ఉద్వేగభరితమైన మాటలు పంజాబ్ యువతను, ఇతర దేశాలలో తప్పుదోవ పట్టించే ధోరణిలో ఉన్నాయని, ఈ చర్యలు యువతను దిలావర్ సింగ్గా మారి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ముఖ్యమంత్రి మాన్ని హత్య చేయాలని ప్రోత్సహిస్తున్నాయని పోలీసులు పిటిషన్లో పేర్కొన్నారు. తమ భావజాలంతో ఏకీభవించని ప్రతీ ఒక్కరికి కూడా హాని కలిగించే విధంగా, శాంతిభద్రతలకు, పబ్లిక్ ఆర్డర్కి ఇబ్బందులు తలెత్తుతాయని పంజాబ్ పోలీసులు హైకోర్టులో సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం అమృత్పాల్ సింగ్ దేశ భద్రత చట్టాల కింద అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. ఇతని అనుచరులు సరబ్జీత్ సింగ్ కల్సి మరియు గుర్మీత్ సింగ్ గిల్ అలియాస్ గుర్మీత్ భుక్కన్వాలా దాఖలు చేసిన వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమను నిర్భందించడాన్నా వీరు సవాల్ చేశారు. దీనికి సమాధానంగానే పంజాబ్ పోలీసులు కోర్టుకు వివరణ ఇచ్చారు.
తాజావార్తలు
-
Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: ‘ప్యారడైజ్’ ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
-
Srikanth Odela: ‘దసరా’ కేజీఎఫ్ కాదన్న నిరాశను తుడిచేయడానికే నానితో ‘ప్యారడైజ్’..
-
H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
-
Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
-
Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!